పుట:Andhrula Charitramu Part 2.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“క్షితిగతుకర్త నా వినుతి చేకొని పంచమవేద మైన భా
రతము దెనుంగుబాస నభిరామముగా రచించినట్టి యు
న్నత చరితుండు తిక్క కవినాయకు డాదట మెచ్చి ‘భవ్యభా
రతి’యన బేరుగన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుడే”

అను పద్యములో దెలిపియున్నాడు. ఈ బయ్యనామాత్య కవి రచించిన గ్రంథము లేవో దెలియరాకున్నది. ఇట్లే యనేక మహాకవుల గ్రంథము లంత రించియున్నవి. ఆంధ్రదేశభాషాభిమాను లెల్లరును బ్రాచీనాంధ్ర సారస్వత మునకై పరిశోధనల గావించిన దప్పక యనేక గ్రంథము లిప్పటికిని బయల్పడక మానవు.

అనంతర రాజకీయస్థితి

మనుమసిద్ధి రాజు మరణ సంవత్సరము తెలియబడనందున నెప్పటి వర కాతడు పరిపాలనము చేసియుండెనో చెప్పజాలను. అయినను సిద్ధిరాజు మరణానంతరము విక్రమసింహపురమునకు దక్షిణభాగమునం దున్న దేశ మం తయు కాకతీయ సేనాధిపతుల వశమయ్యెనని చెప్పవచ్చును. తెలుగుచో డులకును, కాకతీయ సేనాధిపతులకు అప్పుడప్పుడు పోరాటములు జరుగు చుండుట స్పష్టమైన విషయము. కాకతీయ సేన్యాధ్యక్షులలోని ప్రముఖు లయిన గంగయసాహిణి, త్రిపురారి దేవుడు, మొదలగు వారు మిక్కిలి బలవం తులును, పరాక్రమవంతులు అయినందున తెలుగుచోడులను జయించి సామం తులనుగ చేసికొనిరి. శా.శ.1197వ సంవత్సరము అనగా క్రీ.శ. 1275వ సంవత్సర ప్రాంతమున శ్రీమన్మహా మండలేశ్వర నాగదేవ మహారాజు విక్రమ సింహపురమునన పరిపాలనము చేయుచున్నటుల ఆత్మకూరు సీమలోని కామిరెడ్డిపాడులో వెలసియున్న దుర్గాపరమేశ్వరి కైంకర్యమునకై అనుయూరు ప్రభువులగు ఇతమరెడ్డి మారతోయలను బారు చేసిన దానశాసనమును బట్టి తెలియుచున్నది. ఈ శాసనమున పేర్కొనబడిన మాండలికుడైన నాగదేవరాజు కాకతీయాంధ్ర చక్రవర్తుల యొక్క రాజకీయాధికారియు, సేనాపతియు నైనటుల మరికొన్ని శాసనములంబట్టి తెలియుచున్నది. ఇతడు