పుట:Andhrula Charitramu Part 2.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కరాజు వైష్ణవ మతస్థుడు.

తిక్కభూపతి వైష్ణవమతావలంబకుడని యొకశాసనమునుబట్టి స్పష్టముగా దెలియుచున్నది. ఆరుళాళప్పెరుమాళ్ళ దేవాలయములోని యొక శాసనమునదన మతమిట్టిదని ప్రకటించినాడు. "ఎవ్వడు శ్రీ వరదరాజస్వామి చరణసరోరుహములను బూజించుచున్నాడో అతడే నాకు తల్లియు, తండ్రియు, గురువును, ధనమును, పుత్రుడును, మిత్రుడును అగుచున్నాడ"ని చెప్పియుండుటచేత, నీతడు వైష్ణవ భక్తాగ్రేసరుడని స్పష్టముగా బోధపడుచున్నది. కాంచీపురములోని శ్రీ వరదరాజస్వామి దేవాలయము సుప్రసిద్ధమైనది. ఇతడు వైష్ణవమతమునకు బోషకుండగుటవలననే ఇతని కాలమునను, ఇతని సంతతివారి కాలమునను, వైష్ణవమతము పాకనాడు, కమ్మనాడులలో విశేషముగా వ్యాపించినది. అనేక విష్ణ్వాలయములు నెలకొల్పబడినవి. వానికి వసతులేర్పరుపబడినవి. ఇతడు వైష్ణవమతావలంబకుడయినను పరమతసహనము గలిగియుండినట్లే గానంబడుచున్నాడు.

తిక్కరాజు కవిసార్వభౌముడు.

ఇతనికి గలికాలభూవిభుడను నామాంతరముండినటులను, ఇతడు విద్వాంసుడై, కవిసార్వభౌమ బిరుదాంకము గలిగియుండినటులను, నిర్వచనోత్తర రామాయణములోని ఈ క్రిందిపద్యము వలన జక్కగా దెలియుచున్నది.

సీ. భృత్యానురాగంబు పెంపుజెప్పగనేల
పరివారసన్నాహ బిరుదుగలుగ,
వంది ప్రియత్వంబు వర్ణింపగా నేల
పాఠ్యక పుత్త్రాఖ్య పరగుచుండ,
సకల విద్యా పరిశ్రమము దెల్పగనేల
కవి సార్వభౌమాంక మవనిజెల్ల,