పుట:Andhrula Charitramu Part-1.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము

3

నైసర్గిక స్వరూపము.

ఈ దేశమునకు తూర్పుదెసను పర్వత పంక్తులుగలవు. వాటిని తూర్పు కనుమలందురు. ఇవి పడమటి కనుమలవలె నంత యున్నతములయినవి కావు. ఈ దేశము యొక్క మధ్యభాగము మిక్కిలి యెత్తుగనుండి తూర్పునకుఁబోయినకొలది ఏటవాలుగునుండును. తూర్పుకనుమలకును సముద్రమునకును నడుమ చక్కని సారవంతములయిన బయళ్లు కలవు. పురాణ ప్రసిద్ధమయిన మహేంద్రపర్వత మీ దేశము కుత్తరమున నున్నది. వానినే గంజాముజిల్లాలో మలయకొండ అనుచున్నారు. ఈతూర్పుకనుమలే మలయకొండలని నిమ్నగిరులని, పాలకొండలని గోలకొండలని, పాపికొండలని, వేలికొండలని ఆయాజిల్లాలయందు వేర్వేరు పేరులతో బిలువబడుచున్నయవి. ఇవిగాక నగరికొండలు,---కొండలు, శేషాచలపు కొండలు, నల్లమలె కొండలు, ఎఱ్ఱమల కొండలు మొదలగునవి పెక్కులు గలవు.

ఈ దేశము యొక్క యుత్తరభాగము ఋషికుల్య, వంశధార, నాగవళి, శారదా మొదలగునదులచేతను, దక్షిణభాగము గుండ్లకమ్మ, ----చిత్రావతి, పాపఘ్ని మొదలగునదులచేతను, మధ్యభాగము, కృష్ణా, గోదావరిమహానదులచేతను , ఇంద్రావతి, ప్రాణహిత, నగర, మంజీర, భీమ-- తుంగభద్రా మొదలగు వుప నదులచేతనుప్రవహింపబడుచు దేశమంతయు సారవంతమై యొప్పుచున్నది. ఈ నదులన్నియు బడమటబుట్టి తూర్పుగా ప్రవహించి సమద్రమునంగలియుచున్నవి. పీఠభూములు ప్రత్తి పండునట్టి నల్లమట్టి భూములుగానున్నవి.ఈ పీఠభూములయందచ్చటచ్చట రాళ్లగుట్టలును కాఱడవులును కలవు. ఈ దేశమునందు జలసమృద్ధములయిన చెరువులనేకములుగలవు.

శీతోష్ణస్థితులు.

ఈ దేశమునుం దుష్ణకాలమున నుష్ణమును, శీతకాలమున శీతమును అధికముగానుండునుగాని యుష్ణదేశమనియే చెప్పదగియున్నది. తూర్పుభాగమున కంటె నడుమను, బడమటను వర్షములు తక్కువగా గురియును. పీఠభూములు మిక్కిలి పొడిగానుండును. అరణ్యప్రదేశములదక్క తక్కిన తావులారోగ్యప్రదేశములై యొప్పుచున్నవి.