పుట:Andhrula Charitramu Part-1.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంచీపురము, బ్రాహ్మణ క్షేత్రము.

ఆ కాలమునందు కాంచీపురము బౌద్ధులకు మాత్రమేగాక బ్రాహ్మణులకును ముఖ్యస్థానముగ నుండెను. వేద వేదాంగవిదులయిన బ్రాహ్మణోత్తములనేకులు కాంచీపురమును జేరి పల్లవరాజుల పోషకత్వమున బరిషత్తులును వేదవిద్యాలయములను నెలకొల్పి స్వమతవ్యాప్తికై కృషి చేయుచు కృతార్థులగుచుండిరి. ఈ విషయము హోనుత్సాంగు వాక్యములవలన గూడ స్పష్టపడుచున్నది. ఇక్కడనుండి బ్రాహ్మణులనేకులు పల్లవరాజులచే నగ్రహారములను సర్వమాన్యభూములను బడసి బ్రాహ్మణులులేని దేశభాగములకు బంపబడుచుండిరి. దేశములో బ్రాహ్మణేతర మతముల నవలంబించిన ప్రజలే విశేషముగానున్నను బ్రాహ్మణులు తమ విద్యాప్రభావముచే రాజులనాకర్షించి కేవలము వైదికవృత్తులందు మాత్రమేగాక లౌకికవృత్తులయందును బ్రవేశించి మంత్రిత్వాధికారములను సహితముబొంది బ్రాహ్మణులను బ్రాహ్మణవృత్తులను గాపాడుచు సాధ్యమగునంతవఱకు మతాంతురలయిన ప్రజలతో వైరము బెట్టుకొనక జైన బౌద్ధమతాచార్యులపట్ల వైషమ్యమును బురికొల్పక సహనముగలిగి యొప్పియుండి జాగరూకులై మెలకువతో వర్తించుచుండుటచేత బ్రాహ్మణమతాంకురము క్రమక్రమముగా బలపడి జనసామాన్యములో సహితమునాటుకొని వేళ్లుపొఱి మహావృక్షమై శాఖోపశాఖలతో విస్తరిల్లి వర్ధిల్లుటకు హేతువయ్యెను. అప్పటికి నద్వైతమత స్థాపనాచార్యుడగు శంకరుడవతరించి యుండలేదు. అప్పటికి దక్షిణా పథమునందలి బ్రాహ్మణోత్తము లెల్లరును వేదవేదాంగ విద్యలను మాత్రమేగాక సమస్తశాస్త్రమముల బరిశ్రమచేసి యభ్యసించినవారుగ నుండిరి. ఇట్లార్య క్షత్రియులనిపించుకొనగోరిని పల్లవరాజపుత్త్రుల ప్రాపకమువలన గ్రీస్తుశకము మూడవశతాబ్దమునుండి ప్రబలిన హిందూమతము పదునాల్గవ శాతాబ్దము నాటికి దక్షిణాపథమున ముఖ్యముగా నాంధ్రదేశమున బౌద్ధజైన మతములను సంపూర్ణముగా మ్రింగివేసినది.

జైనమతము.

ఆంధ్రదేశమున బహుశతాబ్దములకాలము జైనమతము వ్యాపించి యుండుటవలన నిచ్చట జైనమతచరిత్రమునుగూర్చి కొంచెము చదువరులకు వినిపించుట