పుట:Andhrula Charitramu Part-1.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మించుకొనియెను. మహేంద్రవర్మయు చాళుక్యులను గొన్ని యుద్ధములలో జయించెను.

నరసింహవర్మ.

(975-985.)

మహేంద్రవర్మ తరువాత రాజ్యభారమువహించిన నరసింహవర్మ కాలమున బల్లవులయధికారము మిక్కిలి విజృంభించి యున్నత స్థితికి వచ్చినది. వీనికి మొదటి నరసింహవర్మయందురు. ఇతడు పల్లవుల గర్భశత్రువై భయంకురుడు గానుండిన పశ్చిమచాళుక్యుండగు రెండవపులకేశివల్లభుని రాజధానియగు వాతాపినగరమును ముట్టడించి గైకొనియెను. ఆ ముట్టడికాలమున పులకేశివల్లభుడు మృతుడయ్యెననియెదరు. ఆ దెబ్బతో జాళుక్యులు 13 సంవత్సరములు వఱకు నణగియుండిరి. పల్లవరాజగు నరసింహవర్మయధికారము దక్కనుకు మైసూరునకును వ్యాపించి నిరంకుశమైయుండెను. ఈ నరసింహవర్మ చాళుక్యులనుజయించి వాతాపినగరము గైకొన్న విషయము వాతాపికి నిప్పటి పేరగు బాదామిలోని నరసింహవర్మశాసనమే వేనోళ్లజాటుచున్నది. నరసింహవర్మకు మహామల్లుడని బిరుదుగలదు. ఇతడిటీవల వాతాపికొండనరసింగపోతరాయలని పిలువంబడుచుండెను. ఈ యుద్ధము క్రీస్తుశకము 947 వ సంవత్సరమున జరిగియుండెనని నిశ్చయింపబడినది. ఈ యుద్ధము సింహళదేశచరిత్రమగుమాహవంశమునందు బేర్కొనబడుటయేగాక తమిళపెరియ పురాణమునందుగూడ సూచింపబడినది.

రెండవమహేంద్రవర్మ.

నరసింహవర్మతరువాత సింహసమునకు వచ్చినవాడు మహేంద్రవర్మ. ఈ రెండవ మహేంద్రవర్మ కాలమున సహితము చాళుక్యులు తలయెత్తలేదు. ఇతడును తండ్రివలెనె నిరంకుశముగ బరిపాలనము చేసియుండెను.