అనంతపురం జిల్లా
ఈ జిల్లా యందలి జనులలో నూటికి తొంబై మంది హిందువులును, తొమండ్రకుపైగా మహమ్మదీయులునూ గలరు. ముఖ్య మతముల ననుసరించి ఈ జిల్లాయందలి జనసంఖ్య యీ క్రింద 'తాలూకావారి'గా నీయబడినది.
తాలూకా | హిందువులు | మహమ్మదీయులు | క్రైస్తవులు |
---|---|---|---|
అనంతపురము | 1,06,648 | 9,587 | 676 |
ధర్మవరము | 84,895 | 4,762 | 349 |
గుత్తి | 1,36,826 | 20,450 | 2,293 |
హిందూపురము | 98,345 | 11,470 | 309 |
పెనుకొండ | 89,663 | 8,598 | 227 |
కదిరి | 1,50,259 | 22,338 | 655 |
కల్యాణదుర్గము | 83,850 | 3,503 | 83 |
మడకశిర | 92,698 | 3,489 | 46 |
తాడిపత్రి | 1,00,584 | 14,761 | 1,908 |
---- | ---- | ---- | |
మొత్తము | 6,43,768 | 98,954 | 6,546 |
జైనులీకిల్లాయం వేయిమందికి పైని కలరు. అందు 848గురు మడకశిర తాలూకాయందున్నారు.
వ్యవసాయము
జిల్లాయుత్తరభాగమునందుఁ దక్క ముగునినభాగమునం దంతటను భూమి మిక్కిలి బీదది; ఫలవంతము కాదు. ఉత్తరపు తాలూకాలలోని రేగడిభూమియు నంత శ్రేష్ఠ మయినది కాదు. ఈజిల్లాలో పెద్ద ఆనకట్టలు కానీ, ఏటికాల్వలు కాని లేవు. అందుచేత చెఱువుల యాధారమును, బావులయాధారమును మాగాణిపైరులు, తోఁట పైరులు చేయుదురు. ఈ జిల్లాయం దిరువదివేలవఱకు బావులు కలవు. మిక్కిలి బెట్టకాలములో బావు లతగ నుపయోగపడవు. మెరక పైరులలో కఱ్ఱజొన్న, రాగి ముఖ్యమైనవి. కొద్దిభూమి చేసి ఎక్కువపైరును, వెలగల పైరును పండించుటకు బదులుగా రైతులు ఎక్కువభూముని దున్ని కొద్దిపైరులను బీదపైరులను పండించెదరు. 1340-వ ఫసలీ, అనఁగా 1930-31-వ సంవత్సరమున 'రైతాధీన'మం దున్న భూమి 18,11,709 యెకరములు. దీనివలన వచ్చు శిస్తుమొత్తము రు. 13,39,033లు. ఈ 'భూమి పరిమితము'న 16,90,008 యెకరములనేల మెట్టవ్యవసాయము; 1,21,701 యెకరముల నేల పల్లపు వ్యవసాయము (నీరుపాఱించి చేయునది). ఇప్పటికిని బీడుభూమి లేఁటేఁటను సాగాగుచున్నవి.
ఈ మండలమున పచ్చికబయళ్ళు మెండుగా లేకపోవుటచేత ఇచ్చట పుట్టు పశువులంత శేష్ఠమయినవి కాకయున్నవి. అందువలన నెల్లూరి ప్రాంతపు బలిష్ఠములయిన కోడెలను మంచివెలకుఁ గొని తీసుకొనివచ్చుచుందురు. ఉన్నికొఱకీమండలమునందు గొఱ్ఱెలను మేఁకలను ఎక్కువగాఁ బెంచెదరు. ఈయున్నితో చాలగ్రామములందు రత్నకంబళ్ళు నేయుదురు.
కఱవులు
ఈ జిల్లాయందు వర్షపాతము చాల తక్కువ యగుటవలన పైరుపంటలకు తగినంత నీరు దొరకక తఱుచుగ కఱువు సంభవించుచుండును;ఒక్కొక్కప్పుడతివృష్టి కలిగి పంటలు చెడి కఱవు సంభవించుటయు కలదు. కడచిన శతాబ్దియందు 1803,1824,1833,