పుట:Andhraveerulupar025958mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

శ్రీ శేషాద్రి రమణ కవులు రచియించిన ఆంధ్ర వీరుల చరిత్రమును జూచితిమి. అటువంటి సుప్రసిద్ధ కవీశ్వరులు వ్రాసిన గ్రంథములకు బీఠిక వ్రాయు నధికారము మాకేమాత్రమును లేదు. నిరర్గళధారగవారు బాఱించు చరితావాహిని తరతరముల బాలురకు బాలికలకు జ్ఞానప్రదాయిని యగుగాకయని పరమేశ్వరుని బ్రార్థింతుము. ఆంధ్రదేశ చరిత్రమును గథలమూలముగ బాఠకులకు సుబోధమగునట్లు గావించనెంచిన యుద్యమ మెంతయు శ్లాఘనీయము. అట్టి యుద్యమమును సాధించుటకు దోడ్పడినందులకు వేంకరామ్‌ కంపెనీవారికి, యాంధ్రదేశ మెన్నటికిని మఱువలేదు. మనవారికి ఆత్మ చరిత్రజ్ఞాన మత్యల్పముగ నున్నది. ఇప్పటి S. S. L. C. చదువులో హిందూదేశ చరిత్ర పఠనమునకు ఆంధ్రచరిత్ర పఠనమునకు వలయునంత యవకాశము లేదు. మన చరిత్రజ్ఞానము లేకుండ B. A. పరీక్షలో నుత్తీర్ణు లగుటకు వీలులేర్పడి యున్నవి. ఇట్టి సందర్భమున మన చరిత్రకు సంబంధించిన కథల చదివియైన దాని జ్ఞానమున సంపాదించ గలుగుటకు ఈలాటి పుస్తకము లాధారములు కాగలవు. ఇవి IV, I & VI ఫారములలో Non-detailed పఠనీయ గ్రంథములుగ నేర్పరచుట కెంతయు ననుకూలములుగ నున్నవి. వీనిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, S. S. L. C. Board వారు నామోదించి కవుల యుద్యమమును గంపెనీవారి యుత్సాహమును సాగింతురుగాత మని యెంచుచున్నాము.

హిందూ హైస్కూలు, బందరు, 1927.

వారణాసి శ్రీనివాసరావు, ఎం. ఏ. (ఆనర్సు) ఎల్. టి.