పుట:Andhrapatrika samvatsaradi sanchika 1911.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రిగోదావరీమండలోనుపాధ్యాయసభ స్థాపించి ఎనిమిదేండ్లు కార్యదర్శిగనుండిరి. పెక్కూఅంధ్రపత్రికల కుపవిలేఖరుడై బోధకుల నుపకరించు శారదయను పత్రికను గొంతకాలము ప్రచురించిరి.

కామిశెట్టి పేరమ్మనాయుడుగారు.

గోదావరిజిల్లాలో ఫ్రెంచివారి పట్టణమగు యానాంపుర వాస్తవ్యుడు. ఇచ్చటా కీర్తివడసిన మహాజనులలో నీయనయొక్కడు. ఆపట్టణమునకు మేయరు (పురపాలనాధ్యక్షుడు)గ నుండెను. ఈయన దానధర్మములనుగూడ చేసినారు.

గ్రంధి రంగయ్యార్యులు.

ఈయన గుంటూరు కాపురస్థుడగు వైశ్యుడు. సంగీతవిద్యాపాండిత్యము గలవాడు. శృతిస్మృతి పరిచయుడు. సంస్కృతభాషాజ్ఞాని. ఆర్యవైశ్య సభా కార్యదర్శి.


విశాఖపట్టణము జిల్లాలోని జయపురాధీశ్వరుని పితృవ్యపుత్త్రుడు. సంస్కృతభాషయందు కొన్ని పుస్తకములను, ఓఢ్రభాష యందును ఆంధ్రభాషయందు కొన్ని నాటకములను వ్రాసెను. మాలతీ, కృష్ణార్జునుల చరిత్రములనునవి చెన్నపురి విశ్వవిద్యాలయ ప్రథమ పట్ట పరీక్షల కొకప్పుడు బఠనీయగ్రంథములుగా నిర్ణయింపబడెను.


న్యాయపతి వెంకటరామారావుగారు.

వీరు గంజాంజిల్లా టెక్కలి వాస్తవ్యులు. కృష్ణదేవుగు ఎస్టేటుకు మేనేజరుగ నున్నారు. ఆంధ్రమున కొన్ని పుస్తకములను వ్రాసినారు.


ఆంధ్రమున కొన్ని గ్రంథములను, నాటకములను రచించిరి.


ఈయన మహమ్మదీయుడు. వీరి కుటుంబమున ఆంధ్రభాషాజ్ఞానము పరంపర్యముగ వచ్చుచున్నది. ఈయన వయస్సు 25 సంవత్సరములకు మించదు. కవిత్వము ధారాప్రదముగా జెప్పగలరు. సీతాపతి పరిణయము, శారికాస్వయంవరము, మణిమాల, విచిత్రబిల్హణీయము, చంద్రగుప్త, ప్రహ్లాద, ఇత్యాది నాటకములను, ప్రబంధములను వ్రాసినాడు. కాపురస్థలము గోదావరి మండలములోని పిఠాపురము.


ఉత్తరసర్కారులలో నారాయణదాసుగారితో సమముగ హరికథలను చెప్పువారు వేరొకరుండరు. ఈయన ఆంధ్రగ్రంథకర్త. వీరిచే వ్రాయబడిన కొన్ని పుస్తకములు చెన్నపురి విశ్వవిద్యాలయ పరీక్షకు బఠనీయ గ్రంథములుగ నిర్ణయింపబడినవి.


యోగి శ్రీనివాసశాస్త్రిగారు.


గుమ్మలూరి లక్ష్మీనరసింహశర్మగారు.


బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు.


బాలాంత్రపు రామచంద్ర సత్యనారాయణ.


త్రిపురనేని రామస్వామి చౌధరిగారు.