పుట:Andhra bhasha charitramu part 1.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రమునకు సంబంధించిన యుపభాషలు.

ఆంధ్రము మాతృబాషగానున్న ప్రదేశమునందంతటను నొకటే రూపమున నుండక యీషద్భేదములను గలిగియున్నది. సరిహద్దు ప్రాంతములం దితరభాషలతో సంయోగము గలిగినచోట్ల నాయాభాషల శబ్దజాలమును, కొంచెము మట్టుకు భాషారూపమును నాంధ్రము సంగ్రహించుట వింతగాదు. గంజాముజిల్లాలో బరంపురము, ఛత్రపురము మొదలగు ప్రాంతములం దోడ్రపుమాట లెక్కువగా నాంధ్రమున గలియుచుండును ఉండెను అనుటకు ఉంటిడి యను రూపమిచ్చట వింతగా గానవచ్చును. బళ్లారి మొదలగు ప్రాంతములందు 'కొఱకు,' అనుటకు 'కోస్కరము' అని తెనుగు 'కు' ప్రత్యయమునకును కన్నడపు ఓస్కర ప్రత్యయమునకును సమ్మేళనము కలిగినది. ఇట్టి కొంచెపు భేదములను పాటింపనిచో నాంధ్రభాష యన్నిప్రదేశములందును నొక్కతీరుననే యున్నదని చెప్పవచ్చును. ఏసనుబట్టియు పదములపై మాట్లాడువారుంచు నూతగలస్థానములబట్టియు పదములు వివిధ వికారములను బొందుటయు స్వాభావికమే. ఇదిగాక యాయాప్రదేశముల చరిత్రమును బట్టియు నందలి యన్యదేశీయుల ప్రాబల్యమును బట్టియు శబ్దజాలము కొంతవఱకు వేర్వేరుగా నుండుట సంభవించును. ఏప్రాంతమునందైనను జీవద్భాష యెల్లఫ్ఫుడు నొక్కటే తీరున నుండుట యసంభవము. ఏప్రాంతపు భాషయయినను పరిశుద్ధమయినదని చెప్పుటకు వీలులేదు. గోదావరీ కృష్ణా మండలములవారిభాష యుత్తమమయినదనియు బరిశుద్ధ మయినదనియు గొంద ఱనుకొనుట గలదు. కాని, యిట్టి యభిప్రాయము కేవల మభిమాన ప్రేరితమని వేరే చెప్పనక్కఱలేదు.

జాతివర్ణములబట్టియు వృత్తులనుబట్టియుగూడ నుడికారము మారుచుండును. ఏక కాలమునందే, ఏకప్రదేశమునందే వివిధములగు నుచ్చారణములు వినబడుట యనుభవసిద్ధము, మాటలతీరునుబట్టి యొకడు బ్రాహ్మణుడో, క్షత్రియుడో, వైశ్యుడో, శూద్రుడో, ఇతర జాతివాడో వెంటనే పోల్చుకొనవచ్చును. ఇదిగాక మాటతీరునుబట్టి యొక డేమండలమువాడో కూడ తెలిసికొనవచ్చును. ఇట్టి యుచ్చారణభేదము లన్నియు నే భాషయందైనను స్వాభావికముగ నుండక తప్పదు. అంతమాత్రమున నవియన్నియు భాషాభేదములని యెంచరాదు.

అయినను, సాధారణాంధ్రభాషకు మిక్కిలి విలక్షణముగా గనబడు కొన్ని యుపభాష లాంధ్రేతరప్రదేశములందు ప్రచారములోనున్నవి. మధ్య