పుట:Andhra bhasha charitramu part 1.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. పైశాచ భాషలనుగూర్చి యెక్కువగా డాక్టరు గ్రియర్‌సన్ గారు పరిశోధనములు గావించిరి. వారి యభిప్రాయములు "ది పిశాచ లాంగ్వేజెస్ ఆఫ్ నార్త్ వెస్టెర్న్ ఇండియా "(The Pisaca Languages Of North-Western India)" అను గ్రంధమున వివరింప బడియున్నవి. వాని సారాంశముమాత్ర మీక్రింద నీయబడినది.

రషియాదేశమునకు దక్షిణమునున్న మైదానములలో నిండో-యూరోపియను భాషలను మాట్లాడువారి పూర్వికు లార్యులనుండి విడబడిన ప్రదేశము 'ఖివ' యను పచ్చిక బయలని పరిశోధకులు విశ్వసించుచున్నారు. ఇచ్చట ఐరేనియనులకును, ఇండో-ఆర్యులకును పూర్వికులగు జాతివా రార్యభాషయను నొకభాషను చరిత్రకాలమునకు బూర్వము మాట్లాడుచుండిరి వా రక్కడ నుండి బయలువెడలి, ఆక్ససు, జక్సార్టెసు నదులమార్గము ననుసరించి భోఖందు, బదఖ్షను పీఠభూముల జేరిరి. అచ్చట వారిలో గొందఱు తక్కినవారినుండి విడబడి, దక్షిణమార్గమునుబట్టి, హిందూకుష్పర్వతముల పడమటి కనుమల మీదుగా గాబూలు నదీప్రదేశమును జొచ్చిరి. అటనుండి వారు ఇండియా దేశపు మైదానములలోనికి వ్యాపించిరి. వీరే నేటి ఇండో-ఆర్యుల పూర్వికులు. ఆ కాలమున వారికి సామాన్యమగు నార్యభాషకు గొన్ని ప్రత్యేక లక్షణములుండెను. కాలక్రమమున నవి నేటి ఇండో-ఆర్యభాషా లక్షణములుగ బరిణమించెను.

హిందూకుష్పర్వతముల కుత్తరమున నిలిచిపోయి, కాబూలునకీ ప్రాంతములకు వలసపోవని యార్యులు తూర్పునకును పడమటికిని వ్యాపించిరి. తూర్పునకు బోయినవారు నామీరు పర్వతము నాక్రమించిరి. వీ రిప్పుడు ఘలహ్ భాషలను మాట్లాడుచున్నారు. పశ్చిమముగ బోయినవారు మెర్వ్, పెర్షియా, బెలూచిస్థానముల నాక్రమించిరి. నేడు వారి సంతతివారు ఘలహ్ భాషలతో సంబంధించిన ఐరేనియను భాషలను మాట్లాడుచున్నారు. వీరు విడిపోవుచు, ఇండియావంకకు బయలుదేరునప్పు డార్యులందఱు నొక్కటే భాషను మాట్లాడుచుండిరి. కాని ఐరేనియనులభాష తఱువాతి కాలమున వేరు మార్గమున పరిణామము నొందెను. కావుననే పామీరు పర్వతములందును పెర్షియాదేశమునందును మాట్లాడు భాషలకును, ఇండియాదేశపు ఆర్యభాషలకును జాల వ్యత్యాసము గలిగినది. ఐరేనియను భాషలు ప్రాచీనార్య భాషనుండి తిన్నగ బరిణమించినవిగను, ఇండో- ఆర్యభాషలు వానినుండి విడబడి ప్రత్యేక పరిణామము నొందిన శాఖగను తలంపవచ్చును.

ఈ దర్దికు, లేక పిశాచ భాషలకుజాల ప్రత్యేక లక్షణములున్నవి. కొన్ని విషయములం దవి ఇండో-ఆర్యభాషలను బోలియున్నవి. తకారము