Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఆంధ్రనాటక పద్యపఠనం

నైక్యపరచి నాటకమున నీ కళకు స్థానమున్నదనుట విపరీతపదార్థ ముచే వాదము సాధించుటదక్క వేరుకాదు.

పద్యరచన గణబద్ధము. ఈ నియమబద్ధుడై యుచితపదార్ధ వైదగ్ధ్యముచే రసప్రపంచమున తాను విహరించి చదువరులను విహ రింపజేయట కళానిపుణుడగు కవిధర్మము. అభినయపూర్వకమగు కావ్యప్రదర్శనమే నాటకప్రదర్శనము. నిజమునకు నాటకము దృశ్య కావ్యము. దృశ్య సంగీతము కాదు. దృశ్యకావ్యమునందు పాడుకొన వలసినచో కవి యనుజ్ఞ యిచ్చుచున్నాడు. అది ప్రాచీన సంప్రదా యము. కాళిదాసాది మహాకవులు పాడుకొనునది యని సూచించు టయే దీనికి తార్కాణము.

కాబట్టి యాంధ్రభూమి కామేశ్వరరావుగారి వాదమును జాగ్ర త్తగా నాలోచింపక తీరదు. నాటకరంగమునుండి సంగీతమును కొంత దూరముచేయక విధి లేదు. నిజమగు నాటకప్రదర్శనము ననుసరింపక యుండరాదు. వెంటనే యేతద్విషయమయి ప్రయత్నములు జరుగును గాక యని కోరుచున్నాము. నటసారస్వతసభవారు చేసిన తీర్మానాను సార మాంధ్రావనిలోని యుత్తమనటు లొక్కటిగజేరి భావప్రదర్శన మున కుచితమగు నాటకమును చేగొని, అట్టి నాటకము లేనియెడల వ్రాయించి - ప్రదర్శించి నాటకకళను సంగీతము కబళింపకుండ కాపాడి నాటకము పండితాదరణీయము గావించి లోకకళ్యాణమున కిద్దానిని సాధనము చేయుదురుగాక యని మరిమరి కోరుచున్నాము.”

విషయం పద్యరాగఅభినయకళల మూడింటికి సంబంధించినది అవడం చేతనో, ఆ మూడు కళలూ నాటకప్రదర్శనం చూసిన ప్రతీ వ్యక్తీ ఏ కొంతో తనకికూడా వచ్చునని అనుకోవడానికి వీలుండడం చేతనో, సభల హడావిడిలో ప్రతివ్యక్తినీ తృప్తిపరచడానికి నాకు సావ