పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 అంటూ ఆంధ్ర నా ఉ • పద్య పఠనం భించి, అయిదు నిమిషాలు పాడి ( అప్పట్లో పాడేవాణ్ణి, విన్న జనానికి సాధారణంగా సుస్తీ చేసేది కాదు !) నే చెప్పిన వృత్తాంతం బోధ పడిందా అని అడిగేసరికి, సభవారు రాగంవల్ల వృత్తాంతాలు బోధ పడవని అనడం ఇంద్రగణాలు లేని పద్యాల్ని తాళం వేస్తూ నేను చెప్పడం-పద్యగానానికీ కీర్తనగా నాసికీ భేదం చూపించడానికి నేను పాడడం కొత్త పద్యం కొత్త వాడు పాడేటప్పుడు .శ్రోతని ఎక్కువ ఆక ర్షం ంచేది రాగ సంగతులా వద్యపదార్ధాలా, అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరో “ పద్యపదాలే ' అనగా నేను “ అనుగుం జెల్లెలవై ముకుందు నకు, నాకర్ధాంగివై ...' అంటూ అర్జునుడు పాత్రకున్న పద్యాన్ని, తోడిమీద, " అనుగుం జెల్లెలవై , ముకుందునకు నా కర్ధాంగివై ... ' పాడినా, ఎవ్వరూ నవ్వకపోగా, ' నవ్వరే) ? ' అని శ్రీ వెంకటశాస్త్రులుగా రన్న ప్పుడుకు డా జనం నవ్వకపోవడం 'శ్రుమ్మరి పల్ల టిల్లి తిని ప్రొద్దుననుండియు భోజన స్కులేక ...' అనే పద్యాన్ని చాలా హెచ్చుస్థాయిలో అందుకుని, ' విశుద్ధ నీరమ్ములుగాని, ' అనే చోట నేను సొమ్మసిల్లి నట్లు పడిపోగా నిజం అనుకుని ఎవరో పరిగెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకు రాగానే, నేను లేచి, నీళ్ళు అక్కర్లేదుగాని ఆపట్టులో అభినయం అట్లా ఉండాలని సూచించడం గద్యపద్యాల తేడా గమనిం చడంలో, నేను గద్య చదివేటప్పుడు ఎదటి వాడు తల కదపకుండా విశడం నా తల ఊపకుండానే నేను పద్యం చదివేటప్పుడు ఎదటివాడు తల నియమప్రకారం ఊగిస్తూండడం జరగడంవల్ల, పద్యానికి నియమితమైన నడక ఉన్నట్టు ఋజువు కావడం ! మొదలైనవి. ] నేను వేదిక ఎక్కడానికి మొదటిసారి అదే అయినా, నా భాగ్య వశం చేత, ఉమ్రావులవంటివారైన శ్రీ భోగరాజు పట్టాభిసీతా రాము య్యగారు, శ్రీ చెఱకు వాడ నరసింహంగారు, శ్రీ ముట్నూరి కృష్ణా రావుగారు, శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు, శ్రీ పురాణం