ఈ పుట ఆమోదించబడ్డది
పంతులుగారు కర్మయోగి. భాషా ప్రపంచమున తన కర్తవ్యమును నెఱవేర్చి కృతకృత్యుడయినాడు. శబ్దబ్రహ్మమున లీనమయినాడు.
మహెూపాధ్యాయ బిరుదమునొసగి భారతీతీర్ధము తీర్థస్థానమయినది. కళాప్రపూర్ణ బిరుదము నర్పించి ఆంధ్రకళాపరిషత్తు తన కళాభిమానమును ప్రకటించుకొన్నది. రాయబహదూరు బిరుదముతో - కైజరు హిందీ బంగరు పతకముతో సర్కారువారు తమ గౌరవమును వెల్లడించినారు.
ఆంధ్రులు సమగ్రవ్యాకరణ నిర్మాణ దక్షుని జారవిడుచుకొన్నారు. సమగ్ర నిఘంటు రచనాచణుని ఉపయోగించుకొనలేకపోయినారు.
ఆయనకు స్మారక చిహ్నమునైన నేర్పఱచి తమ కృతజ్ఞతను వెల్లడించు కొందురా?
ఆయన ఆత్మకు పరమాత్ముడు శాశ్వతానందము నొసగునుగాక!