పుట:AndhraRachaitaluVol1.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సమస్యాపూరణ మెంత రమణీయముగ నున్నదో యరయవచ్చును.


స్నిగ్ధత దేవదానవులు చెచ్చెర మందర భూధరంబునన్
ముగ్ధత వాసుకి న్బొదివి మ్రోయ మధింప హలాహలంబు వి
ర్దగ్ధము సేయ నద్రిశిఖరంబులు విచ్చి శరణ్యు దుండియున్
దుగ్ధ పయోధిమధ్యమున దుమ్మది గ్రమ్మె నదేమి చిత్రమో!


కవికల్పద్రుమ మనందగు నానందగజపతి 1897 లో బరమపదమందెను. ఆయన గతించినవెనుక నరసింహాచార్యుని కల మాగిపోయినది. ఇక విరక్తి నంది భగవదుపాసనమున గడపుచు నీభగవత్కవి యెనుబది యేండ్లు జీవించి 1927 లో జీవయాత్రచాలించెను. కూచిమంచి తిమ్మ కవివలె నరసింహాచార్యులును నలుగురు ప్రభువులకాలమున నుండెననుట యొక విశేషము.


ఈకవి తెనుగుకృతులలో గొన్ని చాటువులు, రంగేశ శతకమును శాశ్వతముగ నుండగలవు. సంస్క్ట్తాంధ్రములలో వీ కవిత్వపు మచ్చులు మఱిరెండు:


రాగోయం మధురాధరే క్షిపతి మాం సింహాచలాధీశ తే
జ్ఞానం త్యశ్పదపద్మ శుభ్రవఖరజ్యోత్స్నా మధ: కర్షతి
లో సింహాచలనాధ పాహి లలితం ద్వేధాశ్రమా పాదనామ్‌.
ద్యత్రార్హ్యాన్ధితి రస్యతత్ర ననతిం దేహి ప్రభోమాచిర.

...............

............

.........

................( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)