Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి

1892

వెలనాటిశాఖీయ బ్రాహ్మణుడు. ఆపస్తంబ సూత్రుడు. భారద్వాజ సగోత్రుడు. తల్లి: లక్ష్మీదేవమ్మ. తండ్రి: కృష్ణశాస్త్రి. జన్మస్థానము: గుంటూరు మండలములో మంగళగిరి క్షేత్ర సమీపమున నున్న కాజ గ్రామము. జననము: నందన సంవత్సర భాద్రపద బహుళ షష్ఠీ సోమవాసరము. 12-9-1892.

కృతులు: 1. కావ్యావళి. (రెండు భాగములు), 2. హృదయేశ్వరి (ఉపకావ్యము), 3. పద్మావతీ చరణ చారణ చక్రవర్తి (పద్య నాటిక -- ముద్రి), 4. రాజజామాత. 5. సహజయానపంథీ, 6. నోణక భార్య, 7. వరపరీక్ష (ఈ నాలుగు గీతి నాటికలు), 8. వకుళమాల (గీతికా స్వగతము), 9. రత్నాకరము (గీతికాసంవాదము), 10. ఆవేదన (ఖండకావ్యము), 11. కవిప్రియ (పద్యనాటిక), 12. యక్షరాత్రి (గీతి నాటిక), 13. సాధకుడు (వాకోవాక్యము), 14. కవిరాజు (సర్గబంధము), 15. వ్యాకరణ దర్శన చరిత్ర (ఆంధ్రీకరణము ఈ రెండును రచనలో నున్నవి) 16. మహారాష్ట్ర జీవనప్రభాతము, 17. జీవనసంధ్య, 18. మాధవీ కంకణము, 19. రమాసుందరి, 20. కాంచనమాల, 21. కుంకుమ భరణి (అచ్చువడిన నవలలు) ఇత్యాదులు.

శ్రీకృష్ణలీలాతరంగిణి రచించిన శివనారాయణతీర్థులు పూర్వాశ్రమములో తల్లావజ్ఝుల వంశీయు లని ప్రసిద్ధి. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగా రీవంశము వారికి నాలుగు వందల యకరముల మాగాణి బహుమానమిచ్చినారు. అది యిపుడు విచ్చిన్నమైపోయినదేమో, కాని నేటికిని కాజ గ్రామములో "తల్లావజ్ఝలవారి చెరువు" అని యున్నది. పెక్కు తరముల నుండి తల్లావజ్ఝలవారు సంగీత సాహిత్యములలో మంచి నిపుణత గాంచి వచ్చుచున్న----- .................... .......................... .................... ..................................

(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)

శ్రీశివశంకరశాస్త్రిగారి ప్రతిభ యీనాడు సాహిత్యలోకములో బ్రత్యక్షముగ గనుచున్నాము. ఈయన మంచి సంస్కృత పండితుడని