పుట:AndhraRachaitaluVol1.djvu/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిసభ లిచ్చు గౌరవముగా దిది, యొక్కనృపాలు డిచ్చు గౌ

రవమునుగాదు, కావ్యరసరంజిత భాపుక యావదాంధ్ర గౌ

రవము ప్రజాప్రభుత్వము కరమ్మున వేంకట శాస్త్రిగారికిన్

నవ వరణ స్రజ మ్మిది యనన్య మపూర్వముగాదె తెన్గునన్.

కవి సాధారణుల వలెగాక "కపనార్థ మ్ముదయించితిన్; సుకవితా కార్యంబె నావృత్తి; మద్భవ మద్దాన దరింతు; తద్భవమ మద్భాగ్య్ంబు......" అని చెప్పుకొన్న మహాత్ముడు చెళ్ళపిళ్ళకవి. వ్యావహారికభాషలో నాయన చివరికాలమున రచించిన వివిధ వ్యాసముల బండ్ల దోలవచ్చును. అవన్నియు గలిపి వెలువరించినచో 'విజ్ఞానసర్వస్వము' పునరుద్ధరించినవార మగుదుము. అందుగొన్ని రచనలు 'కథలు, గాధలు' గా నచ్చుపడుచున్నవి. వేంకటశాస్త్రిగారి వ్రాతయైన, నుపన్యాసమైన నొకరకముగానే యుండును. విషయాంతరములోనికి తఱచు దాటుచున్నను, ఎక్కడికక్కడ హృదయంగమముగా నుండునట్లు వ్రాయుటలో, మాటాడుటలో వారిని మించిన వారు లేరు. ఆయన యేమిమాటాడిన నది ధ్వనికావ్యము. వేయేల! ఆయన యుచ్ఛాసనిశ్స్వాపములు, ఆయనపొడుముపట్టులు, ఆయన పొన్నుకఱ్ఱపట్టులు మహాకావ్యములుగా ననవి. పద్యములు పఠించుటలో చెళ్ళపిళ్ళకవి దొకక్రొత్తతీరు. ఆయన ననుకరించి యెందఱో నేటికందముగా బద్యములు చదువుచుందురు. ప్రతివిషయమునను తనదొక ప్రత్యేకత యున్నటులు వేంకటశాస్త్రిగారు ప్రదర్శించినారు. ప్రభుత్వ సంస్థానకవి పదవీప్రదాన సందర్భములో వారుచెప్పినపద్యములు మహోదాత్తములై శాస్త్రిగారి సర్వహృదయమును దాచిపెట్టుకొని యున్నవి.

శా. నన్నాస్థాన కవీంద్రుజేసితి; విక న్నా కాయురారోగ్య సం

పన్నత్వంబు నొసంగుటన్నది క్రమప్రాప్తంబ, నా యీడువా