పుట:AndhraRachaitaluVol1.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతచుట్టాల మని నొక్కి పలుకు మనియె

నొరులకై పగబూనుట యొప్ప దనియె

బడుచుదనపుబింకమ్ములు విడువు మనియె

దలకు మీఱినపని చేయదగని దనియె.


దీనికి బత్యుత్తరముగా యుధిష్ఠిరుడు "సీ. నళినగర్భుని గన్న నారాయణుడు తాను బాంధవుండగుట మా భాగ్య మనుము...గయునిక్షమియించి పార్థుని గాపు మనుము." అని వచించెను. ఆసమయమున నర్జునుడుకూడ బావ కిట్లు ప్రత్యుత్తర మంపెను.


" అతిరాగంబు సుభద్రపై బొడమ సన్యస్తాన్యకామస్థితిన్

మతి యొక్కింతయు బ్రాజ్యరాజ్యపదవిన్యస్తంబుగాకుండ నే

యతిగానుండినవేళలం బిలిచి నెయ్యం బాఱ నన్ సోదరీ

పతిగా జేసిననాటి మేటికృప నాపై జూపవే శ్రీహరీ!


ప్రాణంబులు మాయధీనము చేసిన విపన్నుని బగతున కొప్పగించి శరణాగతత్రాణ బిరుదాంకమగు భరతవంశమునకు గళంకము తేజాల నని మనవిచేయుము." ఈగధ్యపద్యముల సొగసు పరికించితిరా ?


సుభద్ర యర్జునుని గావుమని శ్రీకృష్ణునితో జెప్పినది. అప్పు డతడు రోషావిష్టుడై చెల్లిలితో "ఔను తప్పు నీమగనిది కాదు. నాదే.


నీనాథునకు నేను మేనమఱందినై

యుదయంబు నొందుట యొక్కతప్పు

అన్నయానతి ద్రోసి యామహాత్మునకు ని

న్ను ద్వాహ మొనరించు టొక్కతప్పు

చిన్న నాటనుగోలె జెలిమిమై వారికి

సవకారమ లు చేయు టొక్కతప్పు