పుట:AndhraRachaitaluVol1.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ నావిష్కరించిరి. ఈకబ్బమున గవిత్వమునుగూర్చిన తమ యభిప్రాయము నిటులు వెల్లడించికొనిరి.


మాణిక్యమకుటంబు మౌళిపై దులకింప
          రాజ్యంబునేలెడు రాజుకంటె
లలితలావణ్య విలాసినీ వక్షోజ
          పరిరంభ సౌఖ్యానుభవునికంటె
సతతంబు నానంద సౌగాబ్ధిలో దోగు
          భర్మహర్మ్యస్థ సంపన్నుకంటె
ధనవయోరూప సంతానాది భాగ్యాళి
          దనియ సంతుష్టుడౌ ధన్యుకంటె


మధురమృదువాక్యసంపద మనసుగరచు
కవిత యబ్బిన కవియె యెక్కువయటంచు
నెంచెదరుగాన దత్సుఖ మెంతసుఖమొ
స్వానుభవమున గనుగొన బూనవలదె.

శిశిరకుమారఘోషు ఆంగ్లములో రచించిన దానినిబట్టి 'గౌరాంగచరిత్రము' పద్యకావ్యముగ బంతులుగారు సంతరించిరి. పద్యకావ్యములేగాక 'వనవాసి' 'రూపలత' మున్నగు నాటకములు వచనకృతులు బెక్కులు రచియించిరి. మొత్తము వీరికృతులలో నాంగ్లానుకరణముసా లెక్కువయనవచ్చును. ఈయన గ్రాంథికభాషా ప్రియుడు.


ఇన్ని చూచియే కూచి నరసింహమును, పానుగంటి లక్ష్మినరసింహరావును, చిలకమర్తి లక్ష్మినరసింహమును గలిపి 'సింహత్రయ' మని వ్యవహరించిరి. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించినది.

                           ______________