పుట:AndhraRachaitaluVol1.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టశతావధా నాడ్యున కిప్పుడు

చేరియున్నదిగదా నీసరసంబు

పేటలంకల పాట లీపాటుదెచ్చె

మాల పురుపులపాలయ్యె మఱిపొగాకు

అప్పు ముప్పదివేల రూప్యంబులింక

నెట్లుదీర్చెడు శ్రీపాద కృష్ణమూర్తి.


ద్వితీయశ్రీనాథుడని శాస్త్రులుగారిని కొందరు ప్రశంసింతురు. కవిరాజ కవిసార్వభౌమమాది బిరుదములు తాల్చుట, కనకాభిషేకము బడయుట యివి యిందులకు దార్కాణలు. అతనివలె నీతడు లంక వ్యవసాయము చేసి యుప్పులపా లాయెను. పయిపద్య మాసందర్భములోనిది. జీవితములో నిన్ని సన్మానములుచేయించుకొన్న కృష్ణమూర్తి శాస్త్రిగారు రెండవ శ్రీనాథుడే యనుటలో సంశయములేదు.


1933 లో రాజమహేంద్రవరమున గౌతమీ గ్రంథాలయమునందు వీరికి జరిగిన గండపెండేరపుగాంకయు, నాటి సభామహోత్సవము తెలుగుచరిత్రములో నదృష్టమైన ప్రకరణములు.ఆసభకు యాజమాన్యము వహించిన శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు కృష్ణమూర్తిశాస్త్రి డాకాలున గండపెండెరము నిండు పరిషత్తులో దొడిగి తమ సహృదయతను వెల్లడించుకొనిరి. వేంకట శాస్త్రిగారివంటి శిష్యుడుండుట శ్రీపాద కవికి దర్ప కారణము. ఈ గురుశిష్యుల వాగ్వాదములు కొంతకాలమునకు దేశము మఱచిపోవును. ఇక మఱచిపో జాలనిది వారి శైష్యోపాధ్యాయిక. గండపెండెరము తొడిగించుకొన్న నాటి సభలో శ్రీపాద కవిరాజు చెప్పిన యీ పద్యము మహోదారమైనది.


శా. నాకీరిచ్చిన గండపెండెరమిలన్ నాస్వత్వ మేనాటికిం

గాకుండు న్విను---ప్రాణములతో గన్పట్టునందాక నా