పుట:AndhraRachaitaluVol1.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేడు సమర్థుడై యెదుర సేయగ నుండెనొ పాండవేయు లే

పోడిమి దాత కట్టివని పుట్టగ జేసిరొ ముట్ట జెప్పవే?


మ. పదినాళుల్ పడవాలుగా నిలిచి చాపంబూని కోపంబునం

బదులున్నూఱులు వేలుకోల లొకటంబాఱం బ్రయోగించుచుం

గదనంబుం బొనరించి శత్రుసమితంగారించి కారించి యా

సదిసూనుండు ప్రశాంతుడయ్యె నకటా నా భాగ్యదోషంబునన్.


క. కాలాగ్ని వోలె బగఱం

దూలించుచు గాల్చిపుచ్చి దుర మొనరించెన్

గాలికివిఱిగిన మ్రాన్వలె

గూలెనటే నేల కతడు కుంఠితబలుడై.


వీరి కవితలో దెలుగు పదముల పాలు హెచ్చు. భావమున కంత గంభీరిమ లేకపోయినను, పద్యరచనములో మంచి ధారాళత గల తీరు కృష్ణమూర్తి శాస్త్రిగారికి నిసర్గజమైనది. కూర్చున్న వాడు కూర్చున్నటు లుండి లక్షలు పద్యములు రచించిన యీ కవిరాజు పట్టుదల తెలుగు కవుల కొకయొరవడి.


మొదటినుండియు శాస్త్రిగారికి శ్రీనాథునిపై నభిమానము మెండు. కవితారీతిలో శ్రీనాథునకు వీరికి నెంతో యంతరము. కొంతవఱకు శ్రీ నాథుని జీవితముతో వీరిజీవితమున కున్న పోలిక నీపద్యము వెల్లడించుచున్నది.


గౌతమీ మాహాత్మ్యకర్త కంఠము జుట్టు

కొని యుండెనేగదా ఋణము చిలువ

కవిమిత్త్రు మేనెల్ల జివికించెనేగదా

యప్పులవారి వాక్యాయుధములు

శ్రౌతి మాన్యక్షేత్ర సమితి కొదువ బెట్ట

బడెగదా వృషల సంభవునియొద్ద