పుట:AndhraRachaitaluVol1.djvu/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్సం డెంతటివాడె? యేళ్ళు పదిషే......


ఈపద్య మీయనదే.


ఈయన పోతనవలె సహజపాండిత్యుడు. అతడు భాగవతము నాంధ్రీకరించిన నితడు దేవీభాగవతము నాంధ్రీకరించినాడు. ఈయన కవితాసంపన్నుడేగాక మోహనరూప సంపన్నుడు కూడనని చూచినవారు చెప్పుదురు.


ధనము, రూపము, విద్య, వితరణము, వినయము, వివేకము కలిగిన ఈ శ్రీరామపండితునకు బుత్రులాఱుగు రుదయించి పెంపొందుట యెంతటి యదృష్టమో పరికింపుడు. కుమారులకు కేశవనామములను నామములుగా నుంచెను. శ్రీరామకవి సర్వధాధన్యుడైన కవివతంసుడు. ఆంధ్రదేవీభాగవత రచయితలగు శ్రీ ములుగు పాపయారాధ్యుడు, దాసుశ్రీరామకవి, తిరుపతివేంకటకవులు, త్రిపురాన తమ్మనకవి తెలుగువారికి వందనీయులు.



                        ____________