పుట:AndhraRachaitaluVol1.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూండ్ల రామకృష్ణయ్య

1860 - 1904

ఆరువేలనియోగి బ్రాహ్మణుడు. జన్మస్థానము: దువ్వూరు (నెల్లూరు మండలము). జననము 14 జూలై 1860 సం|| నిధనము: 1 సెప్టెంబరు 1904 సం|| ప్రచురణలు: ఆముద్రితగ్రంథచింతామణి పత్రిక. మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారి జీవితసంగ్రహము. గ్రంథపీఠికలు - మున్నగునవి.

పూండ్ల రామకృష్ణయ్యగారివంటి తెలుగుపండితు లెందఱో కలరు. కాని వారివంటి విమర్శకులు తక్కువ. వీరిది మొగమోటమి లేని విమర్శనము. ఆంధ్రమున వీరిపాండితి నిరూడము. ఈయన బహుశ్రద్దతో వెలువరించిన 'అముద్రితగ్రంథ చింతామణి' పత్రికలలోని ప్రతిపత్రమును వేలకొలది విలువ కలది. ఈపత్రిక 1885 ఒడయారు బీరనాగయ్యగారి సహాయసంపాదకతతో శ్రీరామకృష్ణయ్యగా రారంభించిరి. 1888 లో వీరనాగయ్యగా రీయుద్యమమునుండి తప్పుకొనిరి. శ్రీ వేంకటగిరిమహారాజా శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు వారు దీనికి బోషకులు. ఇక లోటేమి? వీరనాగయ్యగారు విరమించుకోని--, రామకృష్ణయ్యగారు తమ నిర్యాణపర్యంతము 1904 వఱకు నముద్రితగ్రంథచింతామణి నపూర్వపద్ధతులతో వెలువరించిరి. శ్రీరామకృష్ణపండితుని విమర్శ------------నీచింతామణియే నికషో---వీరేశలింగము పంతులుగారి వివేకవర్ధనియు, శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారి కలావతియు బ్రచురింపబడుచుండునాళ్ళవి. ఎన్నిపత్రిక-----------విషయమున నముద్రితగ్రంథచింతామణిదే యగ్ర----------------గ్రంథములు ప్రకటింపబడినవి.------------------------


(ఈఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)