పుట:AndhraKavulaCharitamuVol2.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. మాదయ్యగారి మల్లన్న

ఈతడుకూడ కృష్ణరాయని కాలములో నున్న లక్షణికుడయిన కవులలో నొకడు. ఆవరకు మల్లన్నయని మరియొక కవి యుండి యుండుటచేత నీతనిని తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు. ఇతడు శైవబ్రాహ్మణుడు. కొండవీటి పురమందుండినవాడు. ఈతనికి బూర్వమునందుండి యేకాదశీమాహాత్మ్య మనునామాంతరము గల రుక్మాంగదచరిత్రమును రచియించిన మల్లన ప్రౌఢకవి మల్లన్న యనబడును. మాదయ్యగారి మల్లన్న రాజశేఖరచరిత్రమను మూడాశ్వాసముల గ్రంథమును యౌవనారంభ దశయందే రచియించెనట ! ఈరాజశేఖరచరిత్రము నాదిండ్ల యప్పయామాత్యున కంకితము చేయబడినది. ఈకవి కృష్ణరాయల యనంతరము గూడ జీవించియుండుటచేత నించుమించుగా హూణశకము ---- వ సంవత్సరప్రాంతమువరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా నున్నది. ఈకవి చరిత్రమునుగూర్చి మరియేమియు దెలియకపోవుటచేత రాజశేఖర చరిత్రమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు విరమించుచున్నాను-


ఉ. చొచ్చిన బోకుపోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి నీ

వెచ్చటి కెగిన న్విడుతునే పటుబాణపరంపరాహతిన్

బచ్చడి చేయువాడ నని ఫాలనటద్భృకుటీకరాళుడై

యిచ్చ నొకింతయేని చలియింపక తద్బిలవీధి దూఱగన్- [ఆ.2]


ఉ. సాహసికాగ్రగామి నృవసత్తము డట్లు తదీయ ఘోరమా

యాహమికల్ హరింపుచు నిరంకుశ విక్రమ కేళి జూప ను