ల్మీకులు చెప్పకున్న గృతిలేనినరేశ్వరవర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తినన్. [కూ.తిమ్మన్న]
3. త్రైశంక్యోపాఖ్యానము- దీనిని సింగరన్న రచియించినట్లప్పకవి చెప్పుచున్నాడు. ఇందు హరిశ్చంద్రునికథ చెప్పబడి యుండవలెను-
క. ఝష కేతుద్విషునకు గి
ల్బిషపర్వతనృషున కమృతనిషనిధిజామా
త్రిషునకు ఋషిపూజితునకు
నిషమాక్షున కింద్రముఖదివిజపక్షునకున్.
క. డుంఠీర భైరవుని సితి
కంఠు విశాలాక్షి దండకరు జాహ్నవి వై
కుంఠపతి గుహుని లోలా
ర్కుం ఠేనలుమీఱ భూవరుడు పొడగనియెన్.
4. శమంతకమణి చరిత్రము- ఇది వణుకూరి గుర్వరాజుచే జేయబడినదని యప్పకవి వ్రాయుచున్నాడు.
ఉ. కాయవచోమనస్ఖ్సలనకల్పితదోషము లెల్ల బాయగా
నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిం
బాయకకొల్తు రామనరపాలనిరంతరసౌఖ్యదాయి సీ
తాయి సమస్తశోభననిధాయి మహాఫలసిద్ధిదాయి గన్.
/<poem>
5. శశిబిందు చరిత్రము-
<poem>
క. నాకౌకసు లై నను నీ
డాకకు నిల్చెదరె కటకటా మముబోంట్లన్
జేకొని సంరక్షింపక
నీకిటు లుచితంబె యురవణింప నరేంద్రా.