పుట:AndhraKavulaCharitamuVol2.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   ల్మీకులు చెప్పకున్న గృతిలేనినరేశ్వరవర్తనంబు ర
   త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తినన్. [కూ.తిమ్మన్న]

3. త్రైశంక్యోపాఖ్యానము- దీనిని సింగరన్న రచియించినట్లప్పకవి చెప్పుచున్నాడు. ఇందు హరిశ్చంద్రునికథ చెప్పబడి యుండవలెను-


క. ఝష కేతుద్విషునకు గి
   ల్బిషపర్వతనృషున కమృతనిషనిధిజామా
   త్రిషునకు ఋషిపూజితునకు
   నిషమాక్షున కింద్రముఖదివిజపక్షునకున్.


క. డుంఠీర భైరవుని సితి
   కంఠు విశాలాక్షి దండకరు జాహ్నవి వై
   కుంఠపతి గుహుని లోలా
   ర్కుం ఠేనలుమీఱ భూవరుడు పొడగనియెన్.

4. శమంతకమణి చరిత్రము- ఇది వణుకూరి గుర్వరాజుచే జేయబడినదని యప్పకవి వ్రాయుచున్నాడు.


ఉ. కాయవచోమనస్ఖ్సలనకల్పితదోషము లెల్ల బాయగా
   నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిం
   బాయకకొల్తు రామనరపాలనిరంతరసౌఖ్యదాయి సీ
   తాయి సమస్తశోభననిధాయి మహాఫలసిద్ధిదాయి గన్.
/<poem>

5. శశిబిందు చరిత్రము-
<poem>

క. నాకౌకసు లై నను నీ
   డాకకు నిల్చెదరె కటకటా మముబోంట్లన్
   జేకొని సంరక్షింపక
   నీకిటు లుచితంబె యురవణింప నరేంద్రా.