పుట:AndhraKavulaCharitamuVol2.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. అని యిష్టదేవతాస్తుతి
   యును సకలకవీంద్రులనుతియును గురునతియున్
   వినయమున సలిపి తెలుగున
   ఘనకావ్యం బొకటి సేయగా దలచుతఱిన్.


సీ. ధాత రెండవపరార్థమున నాదిదినంబుపగట వరాహకల్పంబునందు
   మహితవైవస్వతమనువేళ దేశంబు లర్థింపనైన మహాయుగమున
   గలిసమయంబున దొలిచరణంబున మానితంబగుచాంద్రమాసమునను
   శాలివాహనశకమున గజ శైల శర సుధాకిరణులసంఖ్యనడవ


   నంగజాబ్దంబుననుదక్షిణాయనమున|జలధరుర్తువు మొదటిమాసంబునందు
   బహుళమున దేవకికి జక్రపాణిపుట్టి| నట్టియష్టమి చనుదేరనధికభక్తి.
    * * * * *

క. కల్పోక్తమార్గమున సం | కల్పము గావించి గోపికావిభుపూజల్
   సల్పిమది నతనిపదములు | నిల్పి పురాణార్థగోష్ఠి నిశ గడపు నెడన్.


గీ. నుదుట గస్తూరి తిలకంబు పొదలువాడు
   తలచిచూచిన నాకులదైవ మగుచు
   బొలుచు నాకులదైవంబు బోలువాడు
   నిలిచె నొకరుడు నాదుముంగలను గలను.

ఇష్టదేవతావందనాదులును గురుదేవతాస్తుతియు జేసి తెనుగున ఘనకావ్యమొకటి చేయ నుద్యమించి శాలివాహనశకము 1578 వ దగు మన్మథనామసంవత్సర శ్రావణ బహుళాష్టమినాడు సంకల్పముచేసి కామెపల్లెదేవాలయములో రాత్రి పురాణగోష్ఠిని గడపుచుండగా శ్రీకృష్ణుడు కలలోవచ్చి యాంధ్రశబ్దచింతామణి నశించిన కథ చెప్పి-


చ. రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తి కా
   వ్యములును దొల్లియైన నిపుడైనను ముంగలనైన దీని సూ