పుట:AndhraKavulaCharitamuVol2.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44. ఎలకూచి బాలసరస్వతి


ఈకవి పదునేడవశతాబ్దారంభమునం దుండి మహామహోపాధ్యాయ బిరుదము నందినవాడయి పాండిత్యముచేత మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాడు.



క. ఆలోక నుతుడు మొన్నటి
   కీలకసమ నామతంగగిరికడ నొసగెన్
   బాలసరస్వతులకు నత
   డోలి దెనుగూటీక దాని కొప్పుగ జేసెన్.


అని యప్పకవి చెప్పుటనుబట్టి యిత డాంధ్రశబ్దచింతామణికి తెనుగుటీకను 1608 వ సంవత్సరమునందు చేసినట్టు కనబడుచున్నది. ఈకవి కట్టకడపట రచించిన రాఘవయాదవ పాండవీయమునందు తాను చేసినగ్రంథములనుగూర్చియు తన్నుగూర్చియు నిట్లు చెప్పుకొను చున్నాడు.



సీ. కవిసమీహితరంగ కౌముదీనామనాటకవిధానప్రతిష్ఠాఘనుండ
   సారసారస్యసచ్చంద్రికాపరిణయప్రముఖశతాగ్రప్రబంధకర్త
   నంధ్రచింతామణివ్యాఖ్యానభాషావివరణాదిబహుతంత్రకరణచణుడ
   వేదశాస్త్రపురాణవివిధసంగీతసాహిత్యాదివిద్యోసబృంహణుండ


   ననఘకౌండిన్యగోత్రుడ హరిపదాబ్జ
   భక్తిశీలుడ నెలకూచి భైరవార్య
   కృష్ణదేవతనూజుడ నేవిచిత్ర
   కావ్య మొక్కటి నిర్మింపగా దొడంగ.


శా. మెండై నట్టి విచిత్రవైఖరులచే మీ దౌమహాకావ్యముల్
   దండిం దొల్లియె చేసి రాదిములు తత్కావ్యాధికశ్లాఘమై