పుట:AndhraKavulaCharitamuVol2.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘనులు కృష్ణయ వీరసల్ కవియె జెన్న
మాంబ యనుసాధ్వియందు ని న్నాదరమున
దలప రామన్న నీపినతండ్రికొడుకు
మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఈకవియొక్క వినయశౌశీల్యాదులు కవిస్తుతి మొదలైన యీ కృత్యాదిపద్యములవలన దేటపడుచున్నవి-


సీ. వాల్మీకి ముఖ్యగీర్వాణకవీంద్రులకును నన్నపార్యాదితెలుగుకవుల
కును శుభంబు లొసంగు మని భద్రగిరిరామభద్రుని గడుభక్తి బ్రస్తుతించి
కవివరు ల్నామీద గలదయచేతను గబ్బంబు చెప్పగాగలనటంచు
భావించి నే నీప్రబంధంబు గల్పింపదలచివాడను సతతంబు నియతి


శారదాదేవి బ్రార్థించి గారవమున
వరము గైకొని మీ రంప వచ్చి వాణి
నాదుజిహ్వాంచలంబున బాదుకొనిన
ధైర్యమున బల్కెదను గవివర్యులార!


గీ.పెంపుమీఱ వేల్పు బెద్దలు పూజింప | బాలుడట్లు చేయుభంగిగాను
మీరు కవిత జెప్పినారని నే నిట్టి | చర్య కొనరితి గవివరులార !


క. కదళీపాకముగా బెం | పొదవగ నీ ప్రబంధ మొగి రచియింతున్
గొదవలు మిక్కిలి గల్గిన |సదయత దగ దిద్దవలయు సత్కవివర్యుల్.

గీ. లేకయుండిన జదు వేమిలేనివాని
కిట్టి సద్బుద్ధి జనియించు టెందు గలదు
నిచ్చనిచ్చలు మీరంప వచ్చి వాణి
పొసగ నన్నిట్లు పలికింప బూనె గాక.


గీ. నన్ను బోలినకవి గల్గకున్న ధాత్రి
వరకవీంద్రులన్ పే రెట్లు వచ్చు మీకు