పుట:AndhraKavulaCharitamuVol2.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. యాదవామాత్యకవి

ఇతడు చంద్రహాసవిలాస మను కావ్యమును పూర్వోత్తర భాగములుగా రచియించెను. ఈతనికాల మెప్పుడో తెలియలేదుగాని లక్షణ శిరోమణి యనునామాంతరము గల యాదవామాత్యఛందములోని,

సీ. రగణము శంఖమనగనొప్పుమూడవజామునబవడపు జాయకుజుడు
   గ్రహముగావేల్పు హిరణ్యరేతుడుగాగ దార కృత్తికగాగ దగరురాశి
   గా మేషయోనిగా గణమాసురంబుగా శృంగారరసముగా స్థిరఫలంబు
   భయముగా గౌశికభద్రగోత్రమున నెఱ్ఱనిమేన నృపకులమున జనించె


   బంధుజనగేయ సత్కవిభాగధేయ
   రమ్యచారిత్ర వేంకటరాజపౌత్ర
   వర్ణితోదార బాపన్నవరకుమార
   మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఇత్యాదిపద్యములనేకములు సులక్షణసారములో నుదాహరింపబడి యుండుటచేత నీయాదవామాత్యకవి 1620 వ సంవత్సరమునకు బూర్వపువాడనిమాత్రము నిశ్చయముగా జెప్పవచ్చును. ఇష్టదైవము తన్నుద్దేశించి పలికినట్లుగా గవి చంద్రహాసవిలాసములో నిట్లు వ్రాసి కొనియున్నాడు. <poem>

సీ. ఇట్లనిపల్కె మహీసురాన్వయమున వాసి కెక్కినభరద్వాజమౌని

  గోత్రసంభవులందు గొమరొప్పుభానప్పవంశంబునకు జాలవన్నె తెచ్చి
  నట్టి తిమ్మకవీంద్రు నన్వయంబునబుట్టి మహి మించు నారపమంత్రి పుత్రుం
  డగువేంకటాద్రి కిల్లాలైన కొండాంబతనయు డాబాపన్న తమ్ములైన