పుట:AndhraKavulaCharitamuVol2.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరంగదివ్యధామని
హారుడు స్వయమర్థచోరుడై కొనిపోయెన్.

తనగుడిలోని బంగారపుగిన్నెను గొనిపోయి తనగురు వగు విప్రనారాయణుడు పంపినట్లుగా వేశ్యమాతకు సమర్పించి తనభక్తునకు మరల వేశ్యతోడిపొత్తు సమకూర్చెనట!


చ. సతతము బ్రహ్మరుద్రసురసంయమిముఖ్యుల నాత్మమాయ మో
   హితులుగ జేయుసామి వెలయింతిని మోహిత జేయలేక ప్రా
   కృతజనునట్ల తాను దనగిన్నెనొసంగెను బంటుకోసమై
   మతకరివేశ్యమాతవెడమాయ లజేయులు విష్ణుమాయకున్.

వేశ్యమాయలు విష్ణుమాయనుసహితము మించినవట! దేవాలయములోని స్వర్ణ పాత్రము మాయమగుటకనుగొని జియ్యరు రాజభటుల కెఱిగించి, వారు వేశ్యయింట గిన్నెపట్టుకొని విప్రనారాయణుని చోరునిగా దండితు జేయుటకయి కొనివచ్చినప్పు డాతని గుడివెడల నడవ బోవుచుండగా, శ్రీరంగేశుడు సాక్షాత్కరించి భక్తప్రమోద సంధానముకొఱకు తానే గిన్నెను వేశ్య కిచ్చితినని చెప్పి రాజభటులు పట్టుకొన్న స్వర్ణపాత్రమును మరల వేశ్యకిప్పించి భక్తునకు బ్రహ్మరథము పట్టించి జీవన్ముక్తి యొసంగెనట:


గీ. బ్రహ్మసభయెల్ల భక్తి నప్పరమవైష్ణ
   వోత్తముని బ్రహ్మరథమున నునిచి పట్ట
   ణమున నేగించి రధికసంభ్రమముమీఱ
   జియ్య ముందఱికొమ్మునజేరి మోవ.


   ఆహా! ఏమి యీబ్రాహ్మణోత్తముని భాగ్యము!


ఉ. చోరు డనంగ రా దొరులసొమ్ములు మ్రుచ్చిలినం బ్రపన్నునిన్
   జారు డనంగ రాదు పెలుచం బరకాంతల గూడినన్, దురా