పుట:AndhraKavulaCharitamuVol2.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీముష్టిగూడయు నీతులసిసరులు వేశ్యకు బండుగవేట లౌనె?
నీవేదశాస్త్రముల్ నీజపసంధ్యలు లంజెసానికి బౌ జులగము లౌనె?

పెట్టనోసితివా యెప్పటట్టె యుండు
పెట్టలేకున్న విచ్చేయు పెందలకడ
మొదల రోయింతులకు నొక్కముడుపె కాక
నీసదాచార మేలయ్య! దాసరయ్య!

అని కసరి సాగనంపగా నాభాగవతోత్తముడు వేశ్యాగృహము విడచి తనకుటీరముచేరి తనహృదయేశ్వరిని తలచి చింతిల్లుచు,


గీ. అతివ వైష్ణవమతరహస్యముల జాల
   బరిచయము గన్న యట్టిప్రసన్నురాలు
   శూద్రసంపర్కమున కేల చొచ్చుమరల?
   నిచ్చటికి నెంతప్రొద్దైన వచ్చుగాక.

అని ప్రియురాలి గుణసంపత్తిని బ్రశంసించి యడియాసపడుచు,


గీ. తనకు నేమిత్రవ్వి తలకెత్తిరమరు లీ
   యుర్విమనుజు లేమి యొసగరైరి?
   నింగివారసతుల నిర్మాతృకల జేసి
   పుడమి మాతృభూతముల సృజించె.

అని భూలోకమున వేశ్యలకు తల్లులను సృష్టించినందునకు బ్రహ్మదేవుని నిందించుచు పరితపింపజొచ్చెను. వేశ్యాసంపర్కమువలన నెట్టి దృడమనస్కులకును ననర్థములు వచ్చునని చూపుటకయి యింతవఱకు గల్పింపబడినకథ నీతిబోధకముగానే యున్నదికాని తరువాతి కథ మాత్రము నీతిబాహ్యముగా నున్నది. భక్తు డట్లు పరితపించుట చూచి భక్తజనార్తిహరు డగు రంగేశుడు శిష్యరూపము ధరించి


క. సారమణిఖచిత మగు బం
   గారపు దనగిన్నె వారకామిని కొసగన్