పుట:AndhraKavulaCharitamuVol2.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. నిడుదపట్టె తిరుమణియె వైష్ణవముగాని
   మీర లాడుమాటతీరు చూడ
   ననఘ నొసలు బత్తుడును నోరుతోడేల
   టన్నరీతి తోచుచున్న దిపుడు.

అని నీతులు చెప్పియు,


క. ఓసతి భగవత్సేవకు|వాసి గణింపంగ భాగవతసేవయ;త
   ద్దాసులకైంకర్యము గృప|జేసిన రంగేశ్వరునకు జేయుటెసుమ్మీ.

అని యాతనిచేత బతిమాలించుకొని భాగవత కైంకర్యము నంగీకరించి, తుద కాతని నింటిబంటునుజేసి తనయింటికే గొనివచ్చి పందెము గెలిచెను. ఇట్లావైష్ణవవటుని విటునిజేసి తెచ్చి యిల్లు చేర్చిన తరువాత వేశ్యమాత తగులుకొని


క. నవమదనునైన మెచ్చవు;|తవిలితి వీయఱవ; బోడితలకు వలచితో?
   ధవళాక్షి|వీనివ్రేలుం |జెవులకు వలచితివొ? పిల్లసిగకు వలచితో?

అని కూతునకు బుద్ధిచెప్ప మొదలు పెట్టెను. తాను పట్టినప్రతిజ్ఞ నెఱవేఱినందున,


క. పెదయప్పయు నేనును బ
   న్నిదమాడినపనికి నీతనిం దెచ్చితి నా
   కొదవ యిటదీఱె నిక నీ
   కొదవయె యున్నదన దల్లి కూతునకనియెన్.

కూతురును తల్లిమాటలకు సంతోషించి క్రొత్తయల్లుని నిల్లు వెడలింప దల్లిం బురికొల్పెను. ఆసన్నగైకొని వేశ్యమాత నూతన జామాతను జేరి, <poem>

సీ. నీపట్టెతిరుమణి నీతిరుచూర్ణంబు గణికకు వెండిబంగారులౌనె?

  నీపుట్టగోచియు నీకావివేష్టముల్ వారకాంతకు బట్టుచీరలౌనె?