ఉ. ఒక్కని బిల్వనంపి, మఱియొక్కనిచేత బసిండిపట్టి, వే
ఱొక్కనియింటి కేగుచు, మఱొక్కని నానడుచక్కి నొక్క-
బొక్కికలంచి చూడ భ్రమబొంది విటుల్తెలియంగ లేరుగా
కెక్కడిసత్య మేడవల పెక్కడినేమము వారకాంతకున్?
గీ. అనఘ వేశ్యావిడంబవర్తనము లెన్న
నిసుకపాతఱ యీజోలి యేల త్రవ్వ?
నప్పడుపుగూటిపై నసహ్యత జనించి
నామనసు రోసినట్టిచందంబు వినుము.
* * * *
గీ. వారసతులైన యీసీమవారివలెనె
మోడిమానిసి నైన నేగోడు నెఱుగ;
జిహ్వ నాల్గచ్చరాలు నేర్చినకతాన
బడుపు గూటికి మనసు గొల్పక నిటైతి.
అని వేశ్యావృత్తిని నిందించుచు తియ్యనిమాటలుచెప్పి యాతని చెంత జేరి పరిచర్యచేయుచు దాస్యమిషమున మెల్ల మెల్లగా----యుల్లము కలంప జొచ్చెను. ఇట్లు కొంతకాలము దాసురాలి---గలుగునప్పటికి,
శా. ఆవిప్రోత్తమువజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
ద్భావం బంగనసాహచర్యగుణసంపర్కంబునన్ లోహమై,
గ్రావంబై, దృడధారువై, తరుణవృక్షంబై ఫలప్రాయమై,
పూవై, తన్మకరందమై, కరగె బో బో నీళ్ళకుం బల్చనై.
విప్రనారాయణుని వజ్రకఠినమైన హృదయము దినదినక్రమమున గరగి నీటికంటెను బలుచనై దేవదేవి మనస్సులో నైక్యమయ్యెను. అంతట గురువే దాసురాలికి దాసుడయి పరిచర్యచేయ నపేక్షించి----కొనగా మొట్టమొదట నాటక్కరివారాంగన,