పుట:AndhraKavulaCharitamuVol2.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధీవిశారదసూను తిరుమలాచార్య

వినుతనందను దిరువేంగళనాధు.


ఈకవితాత యైనయన్న యార్యుడు కృష్ణదేవరాయనికాలములో నుండి కొన్నియగ్రహారముల నందెను. కవి తనకు వేంకటాద్రిరాయలు కుండలములు వేసినట్లు తనగ్రంథములోని యెనిమిదవయాశ్వాసాంతము నందీవాక్యములచే జెప్పుకొన్నాడు.


ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ

పతికి బరాముఖ్య భక్తసంతతికి

నంకితంబుగను శ్రీహరిభక్తనికర

పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య

తనయ తిమ్మార్య నందన రత్నశుంభ

దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త

మకరకుండలయుగ్మ మండితకర్ణ-


ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించుచున్నాను-


ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న

మౌనినందను గాంచి మది సంతసించి

పిల్లిగా దోరి జాబిల్లి గాబోలు

జల్లనివెన్నెల జల్లుచున్నాడు;