పుట:AndhraKavulaCharitamuVol2.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేగుణాఢ్యునితండ్రిభోగ వైభవనూత్నసుత్రాము డోబలక్షోణిభర్త
యేవిభుం డలెరామభూవిభు తిరుమలప్రభువేంకటేంద్రుల భాగినేయు
డట్టితిమ్మభూవరు డాజిహతతురుష్క
రక్తశోణనదీకృతప్రబలసలిల
వితతకృష్ణానదీకు డూర్జితుడు కోన
మాంబసుతుడు శ్రీరంగరాజానుజుడు.

మ. సకలశ్రీయుతకొండవీటినగరీసామ్రాజ్యధౌరేయతా
ధికతన్ మీఱుచు నొక్కనా డచలభక్తిస్ఫూర్తి శ్రీవైష్ణవ
ప్రకరంబు న్భజియింపుచున్ హరికథాప్రస్తావనన్ దివ్యయో
గికథల్ వించు దదర్థకావ్యరచనాకేళీసమాసక్తుడై.

ఉ. ఉన్నతి మీరగా బరమయోగివిలాసముపేరికావ్య ము
ద్యన్నవభావబంధురరసాన్వయసన్నుతశబ్దశుద్ధిసం
పన్నత నిట్లు సిద్ధనరపాలునియోబళతిమ్మభువరుం
డెన్నిక జేయ బూని మది నెంతయు సంతస మొందు ధన్యతన్.


పయిపద్యములనుబట్టి యీకవి కావ్యాలంకారసంగ్రహాదులకృతి భర్తలగునరసభూపాలాదులతోను, కృతికర్తలగు రామరాజభూషణాదులతోను, సమకాలికు డగుట స్పష్ట మగునున్నది. కాబట్టి యీ తిమ్మరాజు 1570వ సంవత్సరము మొదలుకొల 1600వ సంవత్సర ప్రాంతములవరకును ప్రసిద్ధు డయియుండవచ్చును. ఈకవి కవితమునం దసమాన మయినప్రజ్ఞ గలవాడు; ఇతడు రచియించిన పరమయోగి విలాసమును నద్భుతములైన చరితములను కలిగియున్నది. పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములవలన కవిత్వప్రౌఢిమ కొంత తేటపడవచ్చును-

ఉ. రెండవమౌనిపుంగవుడు బ్రేమసమాహ్వాయ మైనప్రమ్మిదన్
నిండగ భక్తియన్ చమురు నించి హృదబ్జము వత్తిగాగ ను