చ. అధిపతి నంచు గ్రద్ద మిము నందఱ నీనగవింధ్యవాసకున్
వధ యొనరించి మాంసము లవారణగా బలిపెట్టజూచె మీ
రధములువోలెనుండ దగదన్న ఖగంబులుపల్కె మమ్ము నీ
విధమున బాపగాదలచి వీడగనాడుట మీకు ధర్మమే. [ఆ.3]
ఉ. అంతట రాగమంజరి గృహంబున సీధురసంబు గ్రోలి యే
కాంతమ యప్పురంబు చిఱుగ్రంతల నేగ దలారిమానుసుల్
చెంతల డాసి పట్టుకొని చేతుల దంపిన నన్నుమిన్న యా
ప్రాంతమునందు ద్రెళ్ళి కెళవారయుదూతిక గాంచె నాదటన్. [ఆ.4]
_________
27. శంకరకవి
ఈకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివా డయి యీడూరి కరణమును కార్కొలనువాసస్థుడు నయియుండెను. ఈయంశములను కవి తనపుస్తకమునం దిట్లు చెప్పినాడు.-
గీ. మతి వితర్కింప గేవలమంత్రిమాత్రు
డే ధనంజయబాహుశౌర్యాధికుండు
సత్యవర్తను డీడూరిశాసనుండు
హితవచోహరి బాచయయెల్లశౌరి.
న. అమ్మంత్రినిధానంబునకు నిజస్థానంబు