కును ప్రబంధములను జేయబూనిన కవు లెల్లరు వసుచరిత్రమును ప్రతి రూపముగా జేకొని దాని ననుసరించి తమగ్రంథములను రచియించు చున్నారు. ఈ వసుచరిత్రము హూణశకము 1570 వ సంవత్సరమునకు దరువాతనే రచియింపబడినది. వసుచరిత్ర కృతిపతియైన తిరుమల దేవరాయడు 1567 వ సంవత్సరమునందు తనరాజధానిని పెనుగొండకు మార్చెను. ఈతడు పెనుగొండను రాజధానిగా జేసికొన్నతరువాత మహమ్మదీయులతో జరిగిన యుద్ధవార్త వసుచరిత్రలోని యీ పద్యమునందు జెప్పబడియున్నది-
చ. తిరుమలరాయ శేఖరునిధీరచమూభటరాజి యాజి భీ
కరయవనేశ్వరప్రహితఖానబలంబుల జక్కుసేయ ని
ద్ధర బెనుగొండకొండలు మదద్విపచర్మకపాలమాలికా
పరికరభూషితంబు లయి బల్విడి గాంచె గిరీశభావమున్.
తిరుమలదేవరాయలు తనజ్యేష్ఠపుత్రు డయిన రఘునాథరాజు మృతుడయినతరువాత ద్వితీయపుత్రు డయిన శ్రీరంగరాజును యువరాజునుజేసి రాజ్యభారము నాతనిమీదమోపిన కథగూడ సూచనగా నీపుస్తకమునందు జెప్పబడియున్నది-
చ. హరిపదభక్తిశీలుడగు నారఘునాథనృపాలుకూర్మిసో
దరుడు సింగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ
త్తిరుమలరాయ శేఖరవితీర్ణ మహాయువరాజపట్టబం
ధురడయి సర్వభూభువనధూర్వవాశ క్తివహించు నెంతయున్.
తిరుమలదేవరాయ డవసానదశలో తనరాజ్యభారము నంతను కొడుకులమీద వదలివేసిన తరువాత మూడవకొడు కయిన వేంకటపతిరాజు ఆలీ ఆడిల్ షాతో యుద్ధము చేసి పరాజితుడయి 1777 వ సంవత్సరమునందు రాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మరల మార్చెను. వేంకటపతిరా జోడిపోయినసంగతిని జెప్పకపోయినను కవి