పుట:AndhraKavulaCharitamuVol2.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. తెలివి సింగంపుగద్దియలరాతెఱగంటిదొరలెల్ల మోడ్పుచేతులనెకొల్వ

బూనియేబదియాఱుమానిసినెలవులపుడమిఱేండ్లూడిగంబులకుజొరగ

ఠీవి మున్నీటిలో దీవు లన్నియు నేలుమన్నీలు మెట్టదామరల కెరగ

దనతేజు సుడిగట్టువెనుక చీకటి నెల్ల విరియించు తమ్ములవిందుగాగ


వెలయు మలికిభరాముశా గొలిచిమనుచు

కలన దనచెయ్యి మీదుగా గడిమిమెఱసి

మేలుసిరు లందునట్టి యమీనుఖాన

యొడయ డొకనాడు నిండుపేరోలగమున.


ఇబ్రహీమునే మనవారు గ్రంథములలో నిభరామని వాడి యున్నారు. ఈతనిపేరనే కృష్ణామండలములో నిభరామపురమని యొకయూరు కట్టబడినది. ఈతని పూర్ణమైన పేరు ఇబ్రహీమ్ కుతుబ్‌షా. ఇతడు కుతుబ్‌షా వంశీయులయిన గోలకొండనవాబులలో మూడవవాడు. ఈతని తండ్రిపేరు జామ్‌షీద్‌కులికుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కాబట్టి గ్రంథకర్త యయిన తెలగనార్యుడును ఈకాలములోనే యున్నట్టు స్పష్టమగుచున్నది. యయాతి చరిత్రములోని యీక్రింది పద్యములో నమీనుఖానుని కొడుకయిన ఫాజిలఖాన్ విజయనగరపురాజైన శ్రీరంగరాయని గోలకొండకు దీసికొనివచ్చి మైత్రిచేసినట్టు చెప్పబడి యున్నది.


చ. కని తను రాజు లెన్నుకొనగా బెనుపౌజులతో సిరంగరా

యనికడ కేగి మాటలనె యాయన దేఱిచి తెచ్చి మల్కకున్

మనుకువ నంటుచేసి యొరిమం దగ మెచ్చులుగొన్నమేటి నే

మని పొగడంగవచ్చు నవునౌ నిక ఫాజిలఖానరాయనిన్.


ఇందువల్ల శ్రీరంగరాయని రాజ్యకాలములో యయాతిచరిత్రము రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. తిరుమలదేవరాయని పుత్రుడైన














6ష్