ప్రాంతమునందు రచియింపబడి యుండును. ఈ కవియు 1560 - 70 సంవత్సరముల వఱకు జీవించియుండునని యూహింపదగియున్నది. ఈతని కవిత్వము మృదుమధుర వాక్యరచనాధురీణమయి కర్ణరసాయనముగా నుండును. ఈతని కవనధోరణిని దెలుపుటకు గృష్ణరాయ విజయములోని రెండుమూడు పద్యము లిందుదహరింపబడుచున్నవి-
ఉ. ఠీవిగ నౌకువారును గడిందిరహిన్ వెలుగోటివార లా
రావెలవారు గూడుకొని రాత్రిపగల్ చతురంగసేనతో
నేవగ జూచినన్ దివియ నెంతయు శక్యముగాని దుర్గమా
భూవరమౌళి కాంచి యొకపూటనె తీసెదనంచు నుగ్రుడై.
శా. ఔరా చూచితిగాదె రాయలబలం జౌరౌర యేనుంగు ల
య్యారే యీచతురంగసంఘము లహాహా మన్నెవారల్ బళీ
ధీరుల్ రాజకుమారు లంచు మది నెంతేనద్భుతం బొందుచున్
బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిరప్రౌడిమన్- [ఆ.3]
మ. చెలువల్ తోడ్కొనిరా మణీఖచితమంజీరధ్వను ల్మించగా
దళుకుంజెక్కు మెఱుంగుటద్దములపై దాటంకరత్నద్యుతుల్
వెలయం దా గజరాజపుత్రి యగుఠీవిం దెల్పుచందాన వ
చ్చె లతాంగీమణి మందమందగతులన్ శృంగార ముప్సొంగగన్- [ఆ.4]
________