నాఁడు. భూదేవి పృథుచక్రవర్తికి వెఱచి పారుటయు సముద్రమథనమును జడభరతచరిత్రమును మనోహరముగా నున్నవి. రామకథయుఁ గృష్ణాదులు బ్రాహ్మణకుమారుల బ్రదికించినకథయు నరకాసురవధయు మిగుల సంక్షేపింపఁబడుటచే నాభాగములలో రసము కొఱఁతపడినది. అవకాశమును బురస్కరించుకొని సూరనార్యుఁడు కవితానైపుణ్యము ప్రదర్శించినతావులు గోన్ని కలవు.
అంత్యనియమము
“మ. | కనియెన్ భాగవతోత్తముండు త్రిజగత్కళ్యాణవర్ధిష్టునిన్ | (ఆ.7 ప.335) |
ఉత్ప్రేక్షాలంకారము
"చ. | పడమటివంకఁ గ్రుంక నురుభాస్కరబింబము తూర్చుకొండపైఁ | (ఆ.7 ప.333) |
అచ్చతెనుఁగుఁగూర్పులు
"క. | పచ్చనికసవులు పసులను, విచ్చలవిడి మేయదోలి వేడుకతోఁ గ | (ఆ. 7 ప.192) |
విష్ణుపురాణమును ఈసూరనార్యుఁడెగాక పశుపతిపుత్రుఁ డగునాగనాథుఁ డనుకవియు క్రీ.శ. 1380 ప్రాంతమునఁ దెనిఁగించినాఁడు. ఇతఁడు ప్రౌఢకవి యని యాతనిశాసనశ్లోకములును విష్ణుపురాణములోనిదని ప్రబంధరత్నావళిలో నుదాహరింపఁబడిన యీక్రిందిపద్యమువలనను తెలియవచ్చును.
"ఉ. | మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీజన | |
ఇంతవఱ కీగ్రంథరాజము లభింపకపోవుట సంతాపకరము, ఆధునికుఁ డగు సీతారామసిద్ధాంతికవిగూడ విష్ణుపురాణమును బద్యకావ్యముగఁ దెనిఁగించెనట గాని