పుట:Ananthuni-chandamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈసందర్భమున “మాత్రా”పరిమాణము అచ్చునుగూర్చి చెప్పవలెనుగాని వ్యంజనమును గూర్చి చెప్పకూడదు. అచ్చులబట్టి (syllables) అక్షరము లేర్పడును గాని, వ్యంజనములబట్టి ఏర్పడవు. 'భ్రన్’ లో ఎన్నివ్యంజనములున్నా అచ్చు ఒక్కటే గనుక అది ఒక్క (syllable) అక్షరమనే చెప్పవలెను.

‘వనిత' అనునప్పుడు చివరనున్న హ్రస్వాచ్చుపై నిల్చిన నకారపొల్లు ద్విగుణోచ్చారణ కలదియని చెప్పవలెను; గాని దానికి మాత్రాపరిమాణము చెప్పకూడదు, 'అనగాన్' అనునప్పుడు దీర్ఘాచ్చుపై నున్న నకారపొల్లుకు ఈద్విగుణోచ్ఛారణము లేదు. ఎంతమట్టుకు అజ్ దీర్ఘోచ్చారణప్రయత్నము ఎక్కువై ఉంటుందో అంతమట్టుకు వ్యంజనద్విగుణోచ్చారణ ప్రయత్నముతగ్గును. గనుక ‘త’న్ ‘తాన్’ ‘తంత్’ ‘తాంత్ 'వీటి అన్నిటిలోను తకారముపై నున్న అచ్చు రెండుమాత్రల గురువేగాని భిన్నముకాదు. అయితే వీటిలో వ్యంజనమునకు పూర్వమందున్న హ్రస్వాచ్చు ఎందుకు రెండుమాత్రల గురువైనదంటే: ఎప్పుడైనా ఉచ్ఛారణప్రయత్నమును బట్టి అచ్చుకు మాత్రాపరిణామము చెప్పవలెను. 'తన్' అనునప్పుడు తకారముమీది అకారము ఉచ్చరించినప్పుడు వెంటనే నకారోచ్చారణ చేయవలసి వచ్చుటచేత స్వరోచ్చారణప్రయత్నము ద్విగుణమైనది. అందుచేత 'తన్' రెండుమాత్రల గురువుగా చెప్పవలెను.

I. 20 ఈపద్యములో నాల్గవపాదము చక్కగా అర్థము కాలేదు. “నగణ పునరుక్తి నొక్కటి డిగియె” అంటే చంద్రగణ