మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకును గుదురుపడును” అని వ్రాసినారు.
వీరిప్పుడు క్రొత్తగా తెచ్చిపెట్టిన గణములు (IUI, IUU, IUUU, IUIU, IUUI, IUII[1]). కర్ణాటలాక్షణికులు తమ బ్రహ్మ విష్ణు గణములందుగాని, తెలుగులాక్షణికులు తమ సూర్యేంద్రగణములందుగాని వీటిని చేర్చుకోలేదు. తెలుగులాక్షణికులు గ్రహించిన సూర్యేంద్రగణములు మార్చి ఆ తెనుగులాక్షణికులు గ్రహించిన మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకు కుదురుపడును అని శాస్త్రులవారు వాదించుటవల్ల లక్షణసమన్వయము సిద్ధించినదా? సూర్యేంద్రగణముల గురించి తెనుగులాక్షణికులు చెప్పిన లక్షణము కేవలము మధ్యాక్కరలకోసమై[2] మార్చి హ్రస్వాక్షరములకు పరమందున్న పూర్వానుస్వారములను వీలయినచోట్ల అర్ధానుస్వారములుగా పరిగణించే పూర్వసంప్రదాయమును పరిత్యజించి శాస్త్రులవారు ఒక క్రొత్తమార్గమును అవలంబించుటవల్ల ప్రయోజనమేమైనా ఉంటే ఆక్షేపణముండకూడదు. వారిమార్గ మవలంబించవలసినదే అవును. శాసనాక్కరల లక్షణము చెప్పడమే ప్రయోజనమంటే, వారీలాగున క్రొత్తమార్గ