ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వృత్తములలో ఎక్కడెక్కడ విశ్రాంతి ఉండవలె నని చెప్పినారో ఆవృత్తములకు సరియైన తెలుగుపద్యములలో ఆయాస్థలములందే వడినియమము సాధారణముగా ఉన్నది; గాని, చాలాచోట్ల తప్పినది. ఉదాహరణములు:
1. భుజంగ ప్రయాతము:-- సంస్కృతమున 6 అక్షరములు తర్వాత[1] తెలుగున 7 తర్వాత వేదము వేంకటరాయశాస్త్రులవారు సంస్కృతపండితులు గనుక సంస్కృతనియమమే పాటించినారు.
2. పంచచామరము: సం. 8; తెలుగు 9.
3. శిఖరిణి:—సం. 6; తె. 12.
4. ఆర్యాదిజాతులు:—చూడండి; మూలము III. 3. 4.
తెలుగుపద్యములలోసే వళిస్థలముల గురించి లాక్షణికులలోను కవులలోను మతభేదమున్నది. చూడండి:—
1. పృథ్వి:— సంస్కృతములో 8. ఈమర్యాద ననుసరించినవారు పెద్దన. అప్పకవి, అనంతుడు, విన్నకోట పెద్దన కవిజనాశ్రయకర్త వీరి మతమున 11 తర్వాత. ఈనియమమును నన్నయ రామరాజభూషణుడు మొదలయిన వారు పాటించినారు.
- ↑ కొందరు లాక్షణికులు ఎన్ని అక్షరములయిన తర్వాత వడి ఉండునో ఆసంఖ్య తెలియజేతురు. కొందరు ఎన్నవఅక్షరము వడి గలదో ఆసంఖ్య తెలియజేతురు. సంకేతభేదమేగాని, స్థితి ఒకటే.