రించి ఛందోదర్పణములో ఉన్నన్ని విషయములు కవిజనాశ్రయములో లేవు.
1 “క. పరగగ నిరువదియాఱ.... ” ఛందో. పుట 61; కవి. పు. 52.
2 "క. క్రమమునఁ బ్రస్తారము....” ఛందో. పు. 85; కవి. పు. 76.
3 "సీ. వృత్తంబునకువలె...” ఛందో. పు. 69; కవి. పు. 67.
ఈ మూడుపద్యములు రెండుగ్రంథములందున్ను కనబడుచున్నవి. వీటిలో మొదటివి రెండున్ను ఎవరు చెప్పినవో ఏ గ్రంథములో ఇవి ప్రక్షిప్తము లనవలెనో తెలియదు. మూడవది ఛందోదర్పణములోనిదేగాని కవిజనాశ్రయములోనిది కాదని మరియొకచోట నీపీఠికలోనే తెలియజేసినాను.
అనంతుఁడు 105 సమవృత్తభేదములను 9 విషమవృత్తభేదములను చూపించినాడు. కవిజనాశ్రయములో 123 సమవృత్తభేదములున్ను 6 విషమవృత్తభేదములున్ను ఉన్నవి.
జాత్యుపజాతుల గురించి ఛందోదర్పణములో చెప్పినంత గ్రంథము కవిజనాశ్రయములో లేదు. రగడలు, కళికలు, ఉత్కళికలు వీటినిగుంచి కవిజనాశ్రయకర్త ఏమిన్నీ చెప్పలేదు.
లక్షణగ్రంథములన్నిటిలోను ఛందోవిషయములు ఎక్కువగా వివరించి చెప్పినది అప్పకవీయమే అనుటకు సందేహము లేదు. అందుచేతనే, అప్పకవి,
“క. | ఒక దానికంటే మఱివే | |