పుట:Anandam Manishainavadu.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్తిలికి అయ్యంకి మా వెంకటరమణ

ముదునూరి వేణుగోపాలరాజు

విశ్రాంత గ్రంధ పాలకులు,

హౌసింగ్‌బోర్డు కాలని, తాడేపల్లిగూడెం

పుస్తకం సమాజ హితాన్ని కోరుతుందని నమ్మిన మా ప్రియమిత్రులు సూరంపూడి వెంకటరమణ. ఉపాధ్యాయునిగా, కవిగా, రచయితగా, కళాకారునిగా, అన్నింటినీమించి కుటుంబ పెద్దగా ఎంత హడావుడు ఉన్నా ఆయనకు గ్రంథాలయం అంటే ప్రాణం. అందువల్లనే ఆయన గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషిచేశారు. ముఖ్యంగా నేను 1979 లో అత్తిలి గ్రంధాలయం అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించినపుడు రమణ ఎన్నో విధాల గ్రంధాలయానికి సహకరించడం తెలుసుకున్నాను.

అయ్యంకి వెంకటరమణయ్య అవార్డుతో రమణ బృందం

(కుడివైపునుండి మూడవవారు)

చిత్రంలో నాటి గ్రంథాలయాధికారులు తమ్మయ్య, కృష్ణారావు,

సంఘం ఉపాధ్యక్షులు సురేష్ బాబ్జి, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు,

సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, రవికిషోర్, కె. వి. సత్యనారాయణ