పుట:Anandam Manishainavadu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హాస్యచతురుడు వెంకటరమణ

అడ్డగర్ల వెంకటేశ్వరరావు,

కళాకారుడు,

విశ్రాంత ప్రధానోపాద్యాయుడు, తాడేపల్లిగూడెం.

తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో అక్షరదీక్షాప్రచార కార్యక్రమం జరుగుతోంది. అది నాలుగు రోడ్లకూడలి. అక్కడ చుట్టూ జనం గుముగూడి ఉన్నారు. "మోసం" అనే నాటిక ప్రారంభమైంది. 'ఒరే ఎంకటేశూ! ఎక్కడున్నావురా' అని ఓ తండ్రి అరుపులు. అందరూ అటువైపు చూస్తున్నారు. తప్పుకోండెహ మా ఎంకటేశు కనిపించాడా... ఏరా సుబ్బయ్యా! అన్నాడు. వాళ్లంటున్నారు ఉండెహె! ఇక్కడ మాస్టార్లు నాటకాలేత్తున్నారు!

వ్యాసకర్త వెంకటేశ్వరరావుతో రమణ హాస్యవల్లరి