పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకని పాదము మ్రోల
         వ్రాలి తన్నర్పించి
ఒక నికుంజము పూలు
         సర్వమ్ము వర్షించే
లలిత చంద్రోఫలము
         నిలువునా కరిగింది
పూర్ణచంద్రుని వెలుగు
         పూతమై ప్రసరింప”

ఆ బాలిక ఈ పాట పాడుకొంటూ తాను రచించే చిత్రఫలకస్తమూర్తికి ఎదురుగా నిలుచుండి పోయినది. అప్పుడామె రూపుతాల్చిన సౌందర్య సర్వస్వం అంత అందాలు కూరిచికొన్న ఆమె తనూరేఖలు ఇదివరకు ఆ అందాలకు మధురత్వ మీయలేకపోయినాయి.

“నే నెవరినో తెలియదాయె
                      ఓ గురూ!
 నీ వెవ్వరో ఎరుగనైతి
 ఎన్నేళ్ళుగా నిద్ర
           నిన్ను తెలియగలేక
 ఈ బ్రతుకు గడిపానొ
           నేనెవరినో తెలియదాయె
                        ఓ గురూ!
 నీవెవ్వరో ఎరుగనయ్యా !

 కటిక చీకటిగాగ
           కలలేని రాత్రయ్యే
 ఈనాటికేగదా
           ఇందుబింబముతోచే
 నే నెవరినో తెలియదయ్యా |
                         ఓ గురూ!
 నీ వెవరవో ఎరుగనయ్యా !

 పరిమళమ్మే లేని
            పసరు మొగ్గను నేను
 నీదు కిరణస్పర్శ
            నిలువుగా వికసిస్తి
 నేనెవరినో తెలియదయ్యా
                            ఓ గురూ!

అడివి బాపిరాజు రచనలు - 6

173

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)