ఒకని పాదము మ్రోల
వ్రాలి తన్నర్పించి
ఒక నికుంజము పూలు
సర్వమ్ము వర్షించే
లలిత చంద్రోఫలము
నిలువునా కరిగింది
పూర్ణచంద్రుని వెలుగు
పూతమై ప్రసరింప”
ఆ బాలిక ఈ పాట పాడుకొంటూ తాను రచించే చిత్రఫలకస్తమూర్తికి ఎదురుగా నిలుచుండి పోయినది. అప్పుడామె రూపుతాల్చిన సౌందర్య సర్వస్వం అంత అందాలు కూరిచికొన్న ఆమె తనూరేఖలు ఇదివరకు ఆ అందాలకు మధురత్వ మీయలేకపోయినాయి.
“నే నెవరినో తెలియదాయె
ఓ గురూ!
నీ వెవ్వరో ఎరుగనైతి
ఎన్నేళ్ళుగా నిద్ర
నిన్ను తెలియగలేక
ఈ బ్రతుకు గడిపానొ
నేనెవరినో తెలియదాయె
ఓ గురూ!
నీవెవ్వరో ఎరుగనయ్యా !
కటిక చీకటిగాగ
కలలేని రాత్రయ్యే
ఈనాటికేగదా
ఇందుబింబముతోచే
నే నెవరినో తెలియదయ్యా |
ఓ గురూ!
నీ వెవరవో ఎరుగనయ్యా !
పరిమళమ్మే లేని
పసరు మొగ్గను నేను
నీదు కిరణస్పర్శ
నిలువుగా వికసిస్తి
నేనెవరినో తెలియదయ్యా
ఓ గురూ!
అడివి బాపిరాజు రచనలు - 6
173
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)