పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“తథాగతుడే తప్పుచేయునా గురుదేవా?”

“తప్పు అంటే సర్వకాలాలకు సమన్వయించని విధానమని నా ఉద్దేశం.”

“సంసారంలో ఉండి నిర్వాణం ఏలా పొందగలరు?”

“సంసారంలో లేకపోయినా, మారజయం పొందనివారు నిర్వాణం ఎలా పొందగలరు?”

“మారవిజయం అందరికీ సాధ్యం కాదంటారు.”

“అవును. జంతుధర్మాలు ఆహారనిద్రాభయాదులు. ఆహారం బ్రతకటానికి, నిద్ర శ్రమ తీర్చుకోడానికి, భయం జాతినీ వ్యక్తినీ రక్షించడానికీ, నాల్గవది జాతిని వృద్ధి చేయడానికి. ఈ జంతుధర్మాలు ఎవ్వరూ మానలేరు. ఏదో ఉగ్రమైన తపస్సుచేసేవారే మానగలుగుతారు. నిష్కామకర్మ అంటే ఈ నాలుగు ధర్మాలు నిష్కామంగా ఆచరించగలగడమే.”

“ఈ జంతుధర్మాలు నెరవేరుస్తూ వాని ఫలం ఎలా వదులుకోగలడు మానవుడు?”

“ఆత్మజ్ఞానం సంపాదించుకొని కర్మఫలాన్ని దహించుతూ మనుష్యుడు జీవితమార్గం నడవాలి.”

“ఆకలివేస్తే అన్నం తింటాడు.”

“అవును.”

“అన్నం తినగానే తృప్తి పొందుతాడు.”

“అవును.”

“ఆ తృప్తి మనస్సుకు. ఆ మనస్సుకే లోబడినవాడు ఇది నాకు కాదు అని ఏలా అనుకోగలడు గరుదేవా?”

“ఈ మనస్సు, దేహం నేను కాను అనే విచారణవల్ల.” ,

ఆమె మౌనం వహించింది. ఆమె తెర ఈవలకు వచ్చి తనదేశికునకు పాదాభివందన మాచరించి వెడలిపోయినది. శిష్యులందరూ లేచి వెళ్ళిపోయినారు.

బ్రహ్మదత్తుడు చిరునవ్వు నవ్వుకొంటూ.... విచిత్రమే! ఇంత బోధిస్తూ ప్రతిక్షణము ఈ బాలికను తాను ప్రేమించడంలేదా? ఆమె దేహాన్ని, మనస్సును, హృదయాన్ని, జ్ఞానాన్ని, ఆమె అహంకారాన్ని, ఆత్మను సర్వస్వమూ తాను ప్రేమిస్తున్నాడు. ఇంకోవంక తత్త్వజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. జ్ఞాన నిశితత్వంవల్ల మేధకు తార్కికంగా ప్రతివిషయమూ గోచరిస్తోంది.

కాని అసలు సత్యమేదో, తనకు అనుభవానికి వచ్చిందో, లేదో అతనికి తెలియదు. ఆ దారివెంట తన ఆత్మేశ్వరి అయిన ఈ బాలిక తన్ను నడిపించుకొని పోగలదా?

6

శాంతిశ్రీ వెళ్ళిపోయింది. కాని ఆమె సర్వస్వమూ బ్రహ్మదత్తుని పాదాల కడనె ఉంచిపోయినది.

“ఒక మొయిలు వాలింది
          ఉత్తుంగ నగముపై

అడివి బాపిరాజు రచనలు - 6

172

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)