పుస్తక సమీక్షలు
2017 డిసెంబరు ప్రపంచ తెలుగు మహాసభల గురించి
సమగ్రంగా తెలిపే రెండు ప్రత్యేక సంచికలు
తెలుగువాణి
ప్రపంచ తెలుగు మహాసభల
ప్రత్యేక వార్తా సంచిక - 2018
ప్రచురణ : పొట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం
చిరునామా : పొట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం,
లలిత కళాక్షేత్రం, పబ్లిక్ గార్డెన్స్,
హైదరాబాద్ - 500 004
ఫోన్ : 040-23230435
జయంతి
ప్రపంచ తెలుగు మహాసభల
విద్య, సాహిత్య, సాంస్కృతిక త్రైమాసిక పత్రిక
పుటలు :212,
సంవత్సర చందా : 500/-
ముఖ్య సంపాదకులు:
డా॥వెల్ళాల కొండలరావు,
ప్రచురణ : సిస్టర్ నివేదిత
పబ్లికేషన్స్, 11-4-654/2,
రెడ్ హిల్స్, లక్టీకాపూల్,
హైదరాబాద్ - 500 004
ఫోన్ : 040-23396358
ఐదు రోజులపాటు - డిసెంబరు 15 నుండి 19 వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు - ప్రారంభ, ముగింపు సభలు, అన్ని సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ గోష్టులు - అన్నిటి వార్తా విశేషాలనూ సంగ్రహించి ప్రచురించిన 'తెలుగు వాణి' ప్రత్యేక సంచికను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. 264 వుటలు గలిగి ఎప్పటికీ దాచుకోదగిన విధంగా వెలువరించిన ఈ సంచికకు ప్రధాన
సంపాదకులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, గౌరవ సంపాదకులు ఆచార్య అలేఖ్య పుంజాల కాగా - సంపాదకులు : డా॥ ఎం. గీతావాణి, రింగు రామమూర్తి, బి. శ్రీనివాసగౌడ్, డా॥ఎన్. సుధాకర నాయుడు. ప్రపంచ మహాసభల గురించిన సమాచారాన్ని సమగ్రంగా ఇచ్చారు.
"జయంతి” మూడు నెలలకొకసారి వెలువడే విద్య, సాహిత్య, సాంస్కృతిక, బహు భాషాపత్రిక. ముఖ్య సంపాదకులు డా॥ వెలిచాల కొండలరావు. ప్రపంచ మహాసభల్లోని ముఖ్య ప్రసంగాలను, ఆ సందర్భంగా వెలువడిన వ్యాసాలను క్రోడీకరించి ప్రత్యేకంగా 200 పుటల్లో పొందు పరచి ఒక ప్రత్యేక సంచికను, రంగుల ఫోటోలతో, కె.సి.ఆర్ తదితర ప్రముఖుల సందేశాలతో సర్వ సమగ్రంగా వెలువరించారు. చదివి తీరవలసిన రచనలు, ప్రసంగ సారాంశాలూ ఇందులో ఉన్నాయి.
పై రెండు ప్రచురణలూ - ఆసక్తిగల ప్రతివారి స్వంత గ్రంధాలయంలోనూ, ప్రతి కళాశాలలో, పాఠశాలల్లో, ప్రజా గ్రంథాలయాల్లోనూ ఉంచాల్సినవి. ప్రచురణ కర్తలూ, ప్రభుత్వమూ - ఇందుకు చొరవతీసుకోవాలి.
దీపం (స్రీవాద కథలు)
దీపం (ప్రీవాద కథలు)
సంకలనం : సన్నప్రనేని అయ్యన్రావు
పుటలు : 181, వెల : రు.100/-
ప్రతులకు : ప్రముఖ పుస్తకవిక్రయ కేంద్రాలు
ప్రచురణ : సన్నప్రనేని పున్నయ్య,
లక్ష్మీనరసమ్మ ట్రస్ట్, ఫ్లాట్నెం. 301,
రిషి ఎన్క్లేవ్, 2/4 లక్ష్మీపురం,
గుంటూరు - 522 007
సెల్ : 94914 78884
స్రీ పురుషుల మధ్య కొనసాగుతున్న అసమానతలు, మగువల మనోవ్యధలు, సంఘర్షణల గురించిన ఒక కథా సంకలనాన్ని తీసుకుని రావాలనే సన్నపనేని అయ్యన్రావు ఆలోచనకు కార్యరూపం ఈ పుస్తకం, ఇందులో 18 కథలున్నాయి.
వాటిలో 15 కథలు ప్రసిద్ద రచయిత్రులు వ్రాసినవి, ౩ కథలు ముగ్గురు ప్రముఖ రచయితలు వ్రాసినవి! 1948 వ సం॥ నుండి 2017 సం॥ వరకు, అంటే దాదాపు ఏడు దశాబ్దాల కాలంలో వివిధ పత్రికలలో ప్రచురింపబడిన ఈ కథలు విశేషంగా పాఠకులను ఆకట్టుకున్నవే!
స్త్రీలో చైతన్యం కలిగి, స్త్రీలు సమస్యల నుండి విముక్తులు కావాలి అని తెలియచేసేవి త్రీ వాద కథలు. త్రీ వాద మూలాలను తెలియచేస్తూ కొ.కు. వ్రాసిన 'పిన్ని' కథలో ఆర్థిక వ్యవస్థ స్రీలకు అధికారం యిస్తే కుటుంబంలో విలువలుంటాయనే వ్యక్తిగత చైతన్యం కనిపిస్తుంది. భార్య అంటే రాక్షస కామం తీర్చుకునే కీలుబొమ్మ అని భావించే భర్త యొక్క లైంగిక దోపిడీ నుండి విముక్తురాలై, తన లైంగిక హక్కును కాపాడుకోటమే జీవితపు వెలుగుగా భావించిన 'కమల పి. సత్యవతి వ్రాసిన 'మాఘ సూర్యకాంతి" లో కనబడుతుంది. దా॥ ఆరేటి కృష్ణ వ్రాసిన 'సుధీర” కథలో ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న శివరాం యొక్క యిష్టా యిష్టాలకు అనుగుణంగా మారిపోయి తన ఉనికినే మరచి పోయింది. కాని అతడు స్వార్ధంతో ఆమెను ఉద్యోగం చేయమనృప్రుడు, స్వేచ్చనుపయోగించుకుని | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ౨ జూలై 2018 |