పుట:Ammanudi-May-2019.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరుల పాలన

ఎస్‌.ఆర్‌. పృధ్వి

99892 23245

పరులపాలనలో తెలుగువారి దుస్థితిని తెలియజెప్పిన “జంపని

వ్యాపార నెపంతో భారత భూ భాగాన్ని హస్తగతం చేనుకుని, రెండు శతాబ్బాల పాటు రాజ్యాధికారాన్ని అనుభవించిన ఆనందంలో ఆంగ్లేయులు ; భాషా సంస్కృతులు విచ్చిన్నమై, సంపద దోపిడీ చేయబడి, మాన ప్రాణాల భయంలో భారతీయులు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది. జాతి స్వేచ్చకోసం కలంతో పోరాడిన చిలకమర్తి వేదుల, గరిమెళ్ళ వంటి కవులలో 'జంపన' ఒకరు. తెలుగు పౌరుషాన్ని అక్షరబద్దం చేసి, కవిత్వంగా మలిచి, ఆ జ్వాలాక్షరాలను ఆంగ్రేయులపై వదిలారు అదే 'ఆంధ్రజ్వాల” కవిత్వం.

తెలుగు నేలను “వేద సుధలను పితికిన (ప్రేమభూమి” అన్నారు కవి. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రతి మనిషిలోను, ముఖ్యంగా కవులు, దేశాన్ని కన్న తల్లితో సమంగా భావించేవారు. పుట్టి, పెరిగిన ఊరుని ఎంతగానో అభిమానించే వారు. పుట్టిన మట్టిలో తనువు చాలించడం గొప్ప భాగ్యంగా భావించేవారు.

ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అందరం స్వతంత్రులమే. ధన కాంక్ష అధికార కాంక్ష దేశాన్ని రాష్ట్రాలను పాలించాలన్న తపన తప్ప, మరొకటి కనిపించదు. ఎవడి గోల వాడిది ; ఎవడి తాపత్రయం వాడిది. నేను, నాది అనే అహం తప్ప ఏకోశానా మనము అనే ధ్యాస కనిపించదు. జంపన తెలుగు నేలను, తెలుగు భాషను ప్రేమించిన కవి.

“నేను తెలుగువాడను - తల్లి నేల కొరకు

రాల్ఫు కన్నీళ్ళే రత్నాల రాసులగును ;

నేను తెలుగు వీరుడ - తల్లి నేల కొరకు

కార్చు రుధిరమ్మె స్వాతంత్ర్య సుధల నొసగు” అంటారు.

నేను తెలుగు వాడను ; ఈ నేల నా తల్లి అని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలుగు మాటలో నత్యము వెలుగుతుందంటారు. తెలుగు పాటలో ధర్మము చెలగుతుందంటారు. తెలుగువారి ఆటల్లో ధైర్యం కలుగుతుందంటారు.

“కనుల జలజల భాప్పముల్‌ కార్చుచున్న

తల్లి వదనమ్ము కనలేము ; తాళలేము” అని మాతృదేశముపై అమితమైన భక్తి ప్రపత్తులను ప్రకటించారు. అంతే కాదు ; ఆ నాటి వైభవం, తెలుగు పౌరుషం గురించి యిలా అన్నారు.

తెలుగు ప్రతాపుని కొలువులో జయభేరి

పలుకదా దిగ్వ్యాప్తి సలుప నేడు?

రాజ రాడ్విభుని కొల్వుంగ రా రేలనో

నన్నయాది కవులానంద గరిమ?

కృష్ణరాయలు స్మరియించు తెలుగు భూమి

తలచదా స్వేచ్భా పథమ్మొకింత?

బాల చంద్రుని భుజాస్ఫాల నమ్మున రేగు

పౌరుషనహ్ని ఏ వసుధ దాగి?

ఈ విధంగా ప్రాచ్య ఆంధ్ర పౌ రాగ్ని లోంచి వెలువడిన జ్వాలలు ఏ విధంగా నున్నవో ప్రస్తావించారు.

తెల్లవాడి పాలనలో మనవి బానిస (బ్రతుకులైనాయి. అని ఎందరో ఆ బాధలు అనుభవించిన స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలు చెప్పాయి. అవి చూచిన కవులు కలాలు విదిలించారు. ఆనాటి బానిస పరస్థితుల గురించి జంపన గారు కూడా వ్రాసారు.

“దేశ కళలపై నివ్చులు పోసినాడు

దేశ కవితల హృదయమ్ము కోసినాడు

పరుల యెొంగిలి కూటికై కరము చాచి,

బానిసత్వము విడలేక బ్రతికి నాడు”

ఆనాడు దేశ సాహితీ, సాంస్కృతిక, కళా రంగాలు నాశనమై, మనుషులు ఆంగ్లేయులకు బాసినలుగా బ్రతకడం, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోనం ముగం వాచి ఎదురు చూడడం వంటి దురదృష్టకరమైన దృశ్యాలు- కవి కంటబడ్డాయి. దేశ సంస్కృతిని దెబ్బతీయడమంటే యిదే కదా -

“మాతృభాషలో మాటాడమరచి తలచు

ఆంగ్లభాషనే సభ నుపన్యాసమిచ్చు

దేశ భక్తులు నీ యింట తిరుగుచుంద

తిరిపమెత్తుట కింకేమి కొరత తల్లి!”

అంటు ఆనాటి దౌర్భాగ్య స్థితి గురించి వాపోతారు కవి.

“తెలుగు స్వభాష యనుచు / నుతించి, పఠించిన వాడు / దుఃఖ భాజనుడయి / కూడు గుడ్డలు / ప్రశాంతియు / పొందలేక / తా వెనుకటి శౌర్య సంపద - / కవి ప్రవరాళి ప్రతిజ్ఞ తెల్పుచును / కనులను ప్రాణముల్‌ నిలువగా / పఠియింపడె దాస్య గీతముల్‌?”

తెలుగు నా భాష యని సగర్వముగా చెప్పుకున్నవాడు కూడు, గుడ్డ, శాంతి, సౌఖ్యములు దూరమై దుఃఖ సాగరంలో కొట్టుకు పోవడం కవి దర్శించాడు. కళ్ళల్లో ప్రాణాలను నిలుపుకుని దాస్య గీతాలు ఆలపించడం దురదృష్టకరం.

జంపన కవిత్వంలో 'బలిపీఠం” అనే కవితా ఖండిక ఒకటి కనిపిస్తుంది. ఆంగ్ల విద్యనభ్యసించి జీవితాన్ని నైవేద్యంగా పెట్టారు అంటారు. | తెలుగుజాతి పత్రిక అన్మునాది 6 మే 2019 |