పుట:Ammanudi-May-2019.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటిదాన్ని రెండవది అణచి వేసి నెగ్గుతుంది. ఇది శాస్త్రిగారికే గాదు, ఆంధ్ర పాఠకులందరికీ అభిమాన రచనే అనుకుంటాను. ఇట్లాంటి వందల కొలదీ రసవత్కథానికలే కాకుండా ఈయన నవలలు కూడా అనేకం వ్రాశారు. రక్షాబంధనం మొదలైనవి అపరాధ పరిశోధకములు. వీటిలో గూడా ఈ రచయిత మేలికత కనబడుతుంది. వంగ అపరాధ కథలతో నిండిన తెలుగు పాఠకులకు ఊరటగా - తెలుగు జీవితంలో నుంచి అట్టి కథలు కల్పించి ప్రజాదరణ సంపాదించారు.

ఆత్మబలి - శాస్రిగారు ఇటీవల రచించిన నవల. వయసు వచ్చిన కొడుకును కులపౌరుష చిహ్నంగా యుద్దానికి పంపిన ఒక కాపు యువతి ముమ్మరమైన యౌవనపు పొంగును ఆపుకోలేక నరకానికి జారిపోతూ చట్టున నిలదొక్కుకుని కొడుకు ప్రతిష్ట కోసం అతని సుఖం కోనం తన అనుభూతిని బలివేసుకుంటుంది. ఈ పతనోత్పతనాలలో రచయిత చూపిన కౌశలం సాటిలేనిది.

నాటకాల్లో “రాజరాజు” శాస్త్రిగారి కీర్తి పతాక అని చెప్పవచ్చు. గ్రాంధికాభిమాని స్వర్గీయ జయపురాధీశుణ్ణి గూడా ఆకర్షించి ఆనంద పెట్టినదంటే ఈ నాటకం యొక్క ఉదాత్తత ఊహించవచ్చు.

అనేకులు “సారంగధరలు” రాశారు. కాని వాటిలోని రాజరాజు పూసలకోటుతో వట్టి నాటకం రాజుగా కనిపిస్తాడు గాని 'యావదాంధ్ర భూమిని ఏకచ్చత్రంగా పాలించిన చాళుక్య ప్రభువుగా కాన్పించడు. ఇక ఆ నాటకాల్లో నన్నయకు నామరూపాలే లేవు. అట్టి కథ తీసుకుని ఇంద్రజాలం చేసినట్టు సజీవమైన ఆంధ్ర రాజ్య వాతావరణం సృష్టించి గంభీర చాళుక్య రాజరాజును, రాజనీతిలో పండిపోయిన తెనుగు మంత్రివృద్దులనూ, మాటలతో బంతులాడే భృత్యవర్షాన్ని ప్రదర్శించారు.

ఇందులోని నన్నయ మహాకవి సృష్టి అపూర్వం. ఈ నాటక ముకాహారానికి మేరుమణి నన్నయ. ఇతడు కులబ్రాహ్మణుడు మాత్రమే అనుకునే అల్పజ్జులకు కూలంకష లోకజ్ఞుడు కూడాను అని స్ఫుటంగా శాస్త్రిగారు తమ నాటకంలో నిరూపించారు.

భారత రచన అరణ్య పర్వంలో ఆగిపోవడానికీ, కోడలు కాదగిన చిత్రాంగిని రాజరాజు వరించడానికీ ఈయన చేసిన వ్యాఖ్యానం అద్భుతమైనది. అధర్మ పరిధిలో భారతాంధీకరణం చెయ్యలేడు నన్నయ మహర్షి

తన భోగం కోసం అన్యాయంగా కొడుకు యౌవనం అడిగి పుచ్చుకున్న యయాతి వంశస్థుడు రాజరాజు. ఎంత ఉజ్జ్వల కల్పన!

కలంపోటు - ఒక ఏకాంక రూపిక.

ఈ రచన చేసిన శాస్రిగారిలో - ఇప్పటి వారి పరిభాషలో - ఒక అభ్యుదయ కవి దాగి ఉన్నాడు. తిమ్మన పారిజాతాపహరణం గురించి చెప్పుకునే ఒక దంతకథ దీనికి ఆధారం. దాన్ని కవి అన్నవాని ప్రజ్ఞా పారమ్యానికి నిదర్శనంగా చేసి శక్తిమంతంగా నడిపారు.

పారిజాత... రచనలో మునిగి తేలే తిమ్మకవిగారికి మహామంత్రి తిమ్మరుసు కొట్టిన దెబ్బ నసాళం అంటింది. “నే నిప్పుడొక రాచకార్యం లో పడి కొట్టుకుంటున్నాను... ఈ స్థితిలో వాజ్యయవిషయం... అందులో శృంగార కవిత్వ...” అనే సన్నాయి నొక్కులతో తిమ్మకవిగారికి గొంతు నొక్కినంతపని అయింది. ఈ బీజాతాపంతో శాస్త్రిగారు కథకు వేగం కల్పించి, తిరుమల దేవి దాసి మంగ. ప్రసంగంతో తిమ్మకవికి తహతహ లెత్తించి, అతని గంటాన్ని అనేక యుద్ధాల్లో ఆరియుతేరిన కర్జాట సార్వభౌముని మీద మో పెట్టి ఓడించి రసవంతమైన పరి సమాప్తి నిచ్చారు.

రాయల సభలోని సాహిత్య చర్చా సౌరభం ఈ చిన్న నాటికలో అనుభూతమై తత్రియావులను ఎన్నటికీ విడువదు.

అయితే ఒక్కమాట - అభిజ్జులైన నటులూ, రనజ్ఞులైన ప్రేక్షకులూ వచ్చేదాకా తెనుగు రంగం మీద ఇట్టి నాటకాల ప్రదర్శనం చూచే యోగ్యత మనకు లేదు.

-4-

రచయితలకు సాధ్యంకాని ఒక అసాధారణ సాహిత్యసంస్థ నడుపుతున్నారు బి శాస్రిగారు. దాని పేరే కలాభివర్ధనీ పరిషత్తు. చాలా రోజులు ఈ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పుస్తకాల అట్టలమీద మాత్రమే కనబడుతూ ఉండేది. ఉండి ఉండి ఒక్కసారిగా కల నిజమైనట్టు ఇది బలిష్టంగా ప్రత్యక్షమయింది. పేరుపడిన ఎందరో రచయితలు కలాభివర్ధని పిలుపుతో వచ్చి అసాధారణ గౌరవమంది బిబిజాంబూనదాంబరంబులు గ్రహించి ఉత్సాహ తరంగితంగా ఉపన్యాసాలివ్వడం, కావ్యగానం చెయ్యడం జరుగుతున్నది. ఈ సమావేశాలకు నాయకమణులు నన్నయ్య శ్రీనాథ జయంతులు. వీటి అన్నిటి వెనకా ప్రబలమైన (ప్రేరకశక్తి శ్రీ శాస్రిగారు. వీరికి సాహితీ 'ప్రియులైన రాజమహేంద్రవర పౌరులు ఆలంబనం. భేష్‌. “మణినా వలయః వలయేన మణి”

మొత్తంమీద - శ్రీ సుబ్రహ్మణ్య శాస్రిగారి సాహిత్య వ్యాసంగం గురించి ఒక చిన్న వ్యాసంలో చెప్పడం సాహసికమైన పని. వారి అన్ని రచనల గురించీ సమగ్ర పరిశీలన చెయ్యవలెనంటే ఒక గ్రంథం వ్రాయడం అవసరం. నాకన్న సమర్థులు ఆ పనికి అర్హులనుకుంటాను. ఇంతకూ - శాస్త్రిగారు షష్టి పూరిత వయస్కులే కాకుండా సాహిత్య శతవృద్భులు గూడా అయి మాకు మార్గదర్శి కావాలని కాంక్షిస్తున్నాము.

కిన్నెర: సంపుటము 3, సంచిక 5, మే 1951)


ఆకాశవాణి - ఆంగ్రభాష

ఆకాశవాణి - విజయవాడలో ముఖ్యంగా యఫ్‌యమ్‌ కృష్ణవేణి వినేవారికి చాలా వరకు ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి. ఆకాశవాణి ఆంగ్లభాషకు ప్రాముఖ్యం ఇస్తున్నదా? లేక కార్యక్రమాలు నిర్వహించే వారి పరభాషా నైపుణ్యం చాటుకొనటానికా? అనే విధంగా ఎక్కువ ఆంగ్ల పదాలు వాడి, వినే సామాన్యులకు అర్ధం అయిన్న, కాకపోయినా మా భాష మాది అనే అహంకారమా? తమిళంలో కాని, కన్నడంలో కాని ఆంగ్ల పదాలు ఆలా తక్కువగా వాడతారు. మన వాళ్ళు ఇతరులను చూసి నేర్చుకొనరు. మాతృభాషపై మమకారం చూపరు. పరభాషా వ్యామోహం తగ్గితేగాని ప్రాంతీయ ప్రసారాలకు గౌరవం రాదు.....ప్రొఫెసర్‌ ఎ.వి. నరసింహం 08678 277155

32

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019.